మహేశ్వరం, ప్రజాతంత్ర డిసెంబర్ 9: మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన పట్లోళ సబితా ఇంద్రారెడ్డి శనివారం జరిగిన శాసన సభలో ప్రమాణ స్వీకారం చేశారు.ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు సార్లు చేవెళ్ల నుంచి, మూడు సార్లు మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ.. నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తుంటారు.
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సబితా ఇంద్రారెడ్డి





