ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టో
ఆశావర్కర్లకు18 వెల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.టిబి, స్కూటమ్ డబ్బాలను ఆశాలతో మోపించకూడదని,టిబి,లెప్రసీ,కంటి వెలుగు తదితర పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని అన్నారు.2021 జులై నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి ఏరియార్స్ వెంటనే చెల్లించాలని అన్నారు. కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్ నెలకు 1000 చొప్పున 16 నెలల బకాయిలు వెంటనే విడుదల చేయాలని,32 రకాల రిజిస్టర్ ప్రభుత్వం ప్రింట్ చేసి సప్లై చేయాలని,ప్రసూతి సెలవుల పైన సర్కులర్ వెంటనే జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి వీరి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
తదితరులు పాల్గొన్నారు.
ఆశ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించండి




