ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 7 : ఆమనగల్ మండల తహసీల్దారుగా సిహెచ్ లలిత సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇంతకుముందు ఇక్కడ తాసిల్దార్ గా పని చేసిన జ్యోతి బదిలీపై హైదరాబాద్ వెళ్లారు. ఆమె స్థానంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో పనిచేసే గిరిజను ఇక్కడి తాహసిల్దారుగా నియమించారు. ఆమె ఆమనగల్లు కు రాకుండా నే వేరే చోటికి బదిలీ చేసుకోవడంతో ఆ స్థానంలో నూతనంగా హైదరాబాద్ నుంచి సిహెచ్ లలితా బదిలీపై ఆమనగల్లు తహ సిల్దారుగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె బాధ్యతలు తీసుకున్నారు.



