ఆమనగల్లు కోర్టు లో నెలకొన్న సమస్యలు పరిష్కరించండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 3 : ఆమనగల్లు కోర్టులో నెలకొన్న సిబ్బంది కొరత తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం రంగారెడ్డి జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి ను ఆమనగల్ కోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలుసుకొని సమస్యను వివరించారు. నూతనంగా ఏర్పడ్డ కోర్టులో సిబ్బంది కొరత తదితర సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేసినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో  యాదిలాల్, దుడ్డు ఆంజనేయులు యాదవ్, మధు, శేఖర్, జగన్, గణేష్, బిక్య, మల్లేష్, దేవేందర్, సంతోష్, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *