శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ లో జిల్లా వెంకటేష్ నూతనంగా ఏర్పాటుచేసిన అయ్యప్ప పూజ సామాగ్రి మరియు గిఫ్ట్ ఐటమ్స్ దుకాణం ను ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాభాపేక్ష కాకుండా నాణ్యమైన సరుకులు అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందుతూ దినదినాభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, అధ్యక్షులు సమ్మారెడ్డి, అనిల్ రెడ్డి, చెంద్రశేఖర్,శివరాజ్ కాశినాథ్ యాదవ్, సాగర్, నర్సింహ, ఆంజనేయులు, నజీర్,రాములు, తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్ప పూజా సామాగ్రి దుకాణంను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ




