ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: మల్లాపూర్ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్ కాలనీలో భూగర్భ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా, సుమారు 17 లక్షల రూపాయల డ్రైనేజి అభివృద్ధి పనులకు బుధవారం ఉప్పల్ శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు బోదసు లక్ష్మీనారాయణ, కటర్ల భాస్కర్, రంగు మల్లికార్జున్ గౌడ్, వంగేటి సంజీవ రెడ్డి, బుసాని రఘు, నాగేందర్, ప్రవీణ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి




