అక్టోబర్‌ 15 ‌నుంచి బండి సంజయ్‌ 5‌వ విడత యాత్ర

భైంసా నుంచి కరీంనగర్‌ ‌వరకు చేయాలని నిర్ణయం

 

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : అక్టోబర్‌ 15 ‌నుంచి బండి సంజయ్‌ 5‌వ విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలు కానుంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత అక్టోబర్‌ 15 ‌నుంచి నిర్మల్‌ ‌జిల్లా భైంసా నుంచి మొదలయి కరీంనగర్‌ ‌వరకు పాదయాత్ర సాగనుంది. బాసర అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బండి సంజయ్‌ ‌భైంసా నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు.

 

బండి సంజయ్‌ ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,260 కిలోవి•టర్ల మేర పాదయాత్రను పూర్తి చేశారు. గతేడాది ఆగస్టు 28న చార్మినార్‌ ‌భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి తొలి విడత పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *