సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: కుకునూర్ పల్లి మండలం పిటి వెంకటాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న డా. బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 20వేల రూపాయలు మెదక్ డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మెన్ గుండ రంగారెడ్డి,సర్పంచ్ కల్పనా స్వామి, మాజీ కొండపోచమ్మ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, టిఆర్ఎస్ మాజీ గ్రామ అధ్యక్షుడు వెంకట చారి, యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్,టిఆర్ఎస్ నాయకులు రమేష్, కనకయ్య, సంఘం సభ్యులు పాల్గొన్నారు.



