పరిగి, ప్రజాతంత్ర,ఆగస్ట్ 16: పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామానికి చెందిన బండి పద్మమ్మ మృతి చెందడంతో విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ బాబు మృతురాలి కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం ఐదువేల రూపాయలు కాసాని యువసేన సభ్యుల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బండి ఎల్లప్ప, బండి నర్సింలు,జోగు వెంకటయ్య, బండి శ్రీనివాస్, జోగు సత్తయ్య, బండి దశరథ్, జోగురాజు, బండి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.



