సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 1: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన హత్య ప్రయత్నాన్ని సిద్దిపేట జిల్లా ట్రస్మా సభ్యులు వ్యతిరేకించారు. హత్య ప్రయత్నానికి సహకరించిన వారు ఎంతటి వారైనా వారికి శిక్ష పడేలా చేయాలని సభ్యులు కోరారు. కొత్త ప్రభాకర్ రెడ్డి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిద్దిపేట జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి ,కోశాధికారి రాజు, ఈసీ మెంబర్ అశోక్ యాదవ్ , మిరుదొడ్డి మండల అధ్యక్షులు శంకర్ ఉన్నారు.
హత్య రాజకీయాలను ఖండించిన సిద్దిపేట జిల్లా ట్రస్మ





