మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 13: మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నంది హిల్స్ నివాసి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి బిఅర్ఎస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. అభివృద్ధి ఇలానే కొనసాగాలంటే, నియోజకవర్గానికి సబితమ్మ నాయకత్వ అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మహిళా నాయకురాలు బండి మీనా నాగేష్, అర్.నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నేత బిఅర్ఎస్ లో చేరిక





