న్యూ దిల్లీ, డిసెంబర్ 15 : సహజీవనం చేస్తున్న శ్రద్దా వాల్కర్ను ఆమె భాయ్ఫ్రెండ్ అన్ పూనావాలా అత్యంత దారుణంగా చంపిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి .. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. ఆ కిరాతక మర్డర్ గురించి ఢిల్లీ క్రై బ్రాంచ్ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తూనే ఉన్నారు. సప అడవుల్లో శ్రద్దా శరీర భాగాలను సేకరించిన పోలీసులు వాటిని డీఎన్ఏ పరీక్ష నిమిత్తం పంపారు.
అయితే ఢిల్లీ అడవుల్లో దొరికిన ఎముకలు శ్రద్దా వాల్కర్వే అని డాక్టర్లు తేల్చారు. డీఎన్ఏ పరీక్ష ద్వారా నిర్దారణ అయినట్లు తెలుస్తోంది. మెహరౌలీ, గురుగ్రామ్ అడవుల నుంచి ఢిల్లీ పోలీసులు శ్రద్దా ఎముకల్ని సేకరించారు. అయితే ఆ ఎముకలకు జరిపిన పరీక్షలో.. ఆమె తండ్రి డీఎన్ఏతో మ్యాచ్ అయినట్లు గుర్తించారు.



