ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 6 : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆమనగల్లు పట్టణంలోని లిటిల్ స్కాలర్ టెక్నో స్కూల్లో వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు. చిన్నారులు గోపిక, కృష్ణుని వేషధారణలో చూపరులను అలరించారు. సుమారు 85 మంది విద్యార్థులు ఈ కృష్ణాష్టమి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ఉట్లు కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ చుక్క అల్లాజిగౌడ్, కరస్పాండెంట్ సుజాత రెడ్డి, అకాడమిక్ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు హైమావతి, శ్వేత, రాధిక, స్వాతి, గీత, చలం వెంకటేశ్వర్లు, యాదయ్య, శ్రీశైలం, మమత, శ్రీ జన్య పాల్గొన్నారు.




