చిన్నకోడూరు, ప్రజాతంత్ర,అక్టోబర్ 18: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని వివిధ గ్రామాల్లో ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గామాత మండపాల వద్ద అమ్మవారు ప్రత్యేక అలంకరణలో పూజలు అందుకుంటుంది. మండల పరిధిలోని రాముని పట్ల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గా మాత అమ్మవారు బుధవారం… మహాలక్ష్మీ దేవి అవతారంలో భక్తుల దర్శనార్ధం ప్రత్యేక అలంకరణలో కొలువుదీరింది. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందించారు. భక్తుల తాకిడితో నిత్యం మండపాలు కిటకిట లాడుతూన్నాయి.
మహాలక్ష్మీ అవతారంలో దుర్గా దేవి




