మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్)
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : మానవ హక్కుల కార్యకర్త కె. బాలగోపాల్ 14వ సంస్మరణ సభ నేడు హైదరాబాద్, బాగ్ లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం మెయిన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నట్లు మానవ హక్కుల వేదిక శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఈ సందర్భంగా ‘25 ఏళ్ల మానవ హక్కుల వేదిక’పై హెచ్ఆర్ఎఫ్కు చెందిన ఎ చంద్రశేఖర్ ప్రసంగిస్తారు. ‘మణిపూర్లో కొనసాగుతున్న అన్యాయం’పై హెచ్సియుకి చెందిన ప్రొఫెసర్ ఖమ్ ఖాన్ సువాన్ హౌసింగ్ ప్రసంగిస్తారు మరియు ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా, హెచ్ఆర్ఎఫ్కు చెందిన డాక్టర్ ఎస్.తిరుపతయ్య ప్రసంగిస్తారు.





