నిరుపేదకు చేయూతనందించిన కసిరెడ్డి మాధవి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 14 : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్ కాలనీ..  ఆమనగల్లు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిరుపేద కుటుంబానికి చెందిన నిరుపేద మహిళలకు కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి సతీమణి మాధవి రెడ్డి పండ్ల షాపు పెట్టించి ఆదుకున్నారు. పేద ప్రజలకు బాసటగా నిలిచారు.  అనంతరం మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లను అడిగారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *