- వాస్తవాల వక్రీకరణ కోణమే కనిపిస్తుంది
- ప్రజలు, ప్రగతి అనే కోణం లేదు…గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ధోరణి
- శ్వేతపత్రంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : రాజకీయ కారణాల రీత్యా కాంగ్రెస్ నాయకులు ఒప్పుకున్నా..ఒప్పుకోకపోయినా..
ఆర్థిక శ్వేతపత్రం పేజి 5లో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ అంచనా- వ్యయాలకు సంబంధించి కాగ్ రిపోర్టు చూశామని హరీున రావు తెలిపారు. అందులో బడ్జెట్ అంచనా 2,31,142 కోట్లు ఉంటే.. 2,31,642 కోట్లుగా చూపించారన్నారు. వ్యయాల్లో కూడా 2,61,932 కోట్లు అని చూపించారని.. కాగ్ రిపోర్టు ఆధారంగా 2,54,525 కోట్లు ఉందన్నారు. అంటే.. దాదాపు 7 వేల కోట్ల ఎక్సపండిచర్ ఎక్కువగా చూపించారని తెలిపారు. మొత్తంగా తప్పుల తడకగా వివరాలు పొందుపరిచారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ధోరణి ఇందులో కనిపిస్తుందన్నారు.





