గుంటి జంగయ్య నగర్ కాలనీ దేవాలయం సమస్య గురించి సుధీర్ రెడ్డిని కలిసిన బస్తీ పెద్దలు

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 11; గుంటి జంగయ్య నగర్ కాలనీ నందు దేవాలయం యొక్క సమస్య గురించి బస్తి పెద్దలు సుధీర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.అందులో కొంత మంది వ్యక్తులు అట్టి దేవాలయం మాది అని ధౌర్జన్యం చేయడం జరుగుతుంది అని తెలిపారు.కావున మాకు అట్టి దేవాలయం విషయంలో న్యాయం చేయాలని కోరారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి  మాట్లాడుతూ ఇరువర్గాల వారిని పిలిపించి మాట్లాడి చట్టబద్ధంగా పోదాం అని తెలిపారు.అట్టి దేవాలయం గురించి ఎవరు కొట్లాడకుండా సామరస్యంగా పరిష్కారం చేసుకునేల చూస్తానని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *