- తెలంగాణలో సమగ్రాభివృద్ధికి కెసిఆర్ బాటలు
- రైతులకు కోతలు పెట్టి..కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్రం
- మండలిలో బడ్జెట్పై చర్చకు మంత్రి హరీష్ రావు సమాధానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : రాష్ట్రంలో కాళేశ్వరం నిర్మాణంతో గోదావరి పరుగులు పెడుతున్నదని, ప్రాజెక్టును ప్రపంచం మొత్తం మెచ్చుకుంటున్నదని, భూమికి బరువయ్యే పంట పండుతున్నదని మంత్రి హరీశ్ రావు చెప్పారు. దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీ పని కోసం తెలంగాణకు వలస వొస్తున్నారని వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అడుగడుగునా వివక్షకు గురైందని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్లో పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. గత పాలకులకు..ప్రస్తుతం కేసీఆర్ పాలనకు చాలా తేడా ఉందని తెలిపారు. తెలంగాణలో పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయన్నారు. బడ్జెట్లో ఎక్కువశాతం బడుగు, బలహీన వర్గాలకు కేటాయింపులు జరిగాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం శాసనమండలిలో బడ్జెట్పై సాధారణ చర్చకు ఆర్థిక మంత్రి హరీష్ రావు సమాధానమిచ్చారు.
వరి నాట్లు వేసేందుకు ఛత్తీస్గఢ్ నుంచి, పత్తి ఏరడానికి కర్ణాటక, హమాలీ పనికోసం బీహార్, మిర్చీ ఏరేందుకు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు కూలీలు వొస్తున్నారని చెప్పారు. దేశంలో కేవలం 49 శాతం మంది ప్రజలకు శుద్ధిచేయబడిన జలం అందుతున్నదని చెప్పారు. తెలంగాణలో మాత్రం ఇంటింటికి సురక్షిత మంచినీటిని అందిస్తున్నామని తెలిపారు. మిషన్ కాకతీయతో చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ కృషివల్లే ఇన్ని విజయాలు సాధ్యమయ్యాయని వెల్లడించారు. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని చెప్పారు. కేంద్ర బ్జడెట్లో కోతలు తప్పమరేవి• లేవని మంత్రి అన్నారు. అందులో రాష్ట్రానికి వొచ్చిందేవి• లేదని విమర్శించారు.
పత్తి రైతులకు కేంద్రం ఏ చెప్పాలనుకుంటున్నదని ప్రశ్నించారు. రైతులకు మద్దతు ధర విషయంలో మొండిచేయి చూపిందన్నారు. రైతులపట్ల కేంద్రం కక్షగట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు కానీ.. ఖర్చు మాత్రం రెండింతలయిందని విమర్శించారు. రైతులకు కోతలు పెట్టి..కార్పొరేట్లకు దోచిపెట్టారన్నారు. మోదీ సర్కార్ కార్పొరేట్ కంపెనీలకు రూ.13,34,304 కోట్లు మాఫీ చేసిందన్నారు. కంటివెలుగును దిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో ప్రారంభిస్తామన్నారని చెప్పారు.




