ఉప్పల్ , ప్రజాతంత్ర, నవంబర్ 30 : పౌరులు తమను ఎవరు పరిపాలించాలో వారు ఎలా పరిపాలించబడాలో తెలుపడానికి వీలు కల్పిస్తుందన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు హక్కు అని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం కాప్ర లోని విజయ హై స్కూల్ కుటుంబ సభ్యుల తో కలిసి బండారి లక్ష్మారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయగల నాయకులను ఎన్నుకోవాలని కోరారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి





