అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం చైర్మన్

కీసర,  ప్రజాతంత్ర , డిసెంబర్  06 :  భారత రాజ్యాంగ నిర్మాత  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట్ల  చంద్రారెడ్డి  బుధవారం స్థానిక  నాయకులతో  రాంపల్లి చౌరస్తాలోని  ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అందరూ ఆయన ఆశయాలను కొనసాగించడానికి కృషి చేయాలని తెలిపారు. బడుగు బలహీనవర్గాల అభివృద్ధి కోసం  కృషిచేసిన గొప్ప నాయకుడు అని  అన్నారు. రాబోవు తరాలకు ఆయన మార్గదర్శకుడు అని    తెలిపారు.  ఈ కార్యక్రమంలో  నాగారం మున్సిపాలిటీ  నాయకులు  గూడూరు ఆంజనేయులు గౌడ్, నిమ్మల శ్రీనివాస్, పంగ శ్రీహరి, రవి, లింగం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *