గ్లోబల్‌ ‌లీడర్‌ ‌షిప్‌లో యువతదే కీలక పాత్ర

యువత శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలి
•సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీలో దేశం కొత్త ఒరవడి
:కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : యువత శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌పిలుపునిచ్చారు. గ్లోబల్‌ ‌లీడర్‌ ‌షిప్‌లో యువతదే కీలక పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. నేషనల్‌ ‌సైన్స్ ‌డే సందర్భంగా హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌ ‌వైభవ్‌-2025‌ను సీఎం రేవంత్‌ ‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌మాట్లాడుతూ.. సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీలో వొచ్చే మార్పుల పట్ల విద్యా ర్ధులు అవగాహన కలిగి ఉండాల న్నారు. రక్షణ శాఖ చారిత్రాత్మక విజయాల్లో కేంద్రం విశేష పాత్ర పోషిస్తుందని తెలిపారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ శాఖకు తాను మంత్రిగా ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నాన్నారు. మానవుని మేధోసంపత్తి చాలా గొప్పదని చెప్పారు.

సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీలో వొస్తున్న మార్పులకు అనుగుణంగా రక్షణ శాఖలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌తెలిపారు. సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీలో దేశం కొత్త ఒరవడిని సృష్టిస్తోందని పేర్కొన్నారు. దేశంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోందన్నారు. అన్ని రంగాల్లో భారత్‌ అ‌గ్రగామిగా మారుతోందని చెప్పారు. రక్షణ శాఖ చారిత్రాత్మక విజయాల్లో కేంద్రం విశేష పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఈ శాఖకు తాను మంత్రిగా ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నాన్నారు. మానవుని మేధ సంపత్తు చాలా గొప్పదని చెప్పారు. సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రక్షణ శాఖలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌తెలిపారు. సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీలో దేశం కొత్త ఒరవడిని సృష్టిస్తోందని పేర్కొన్నారు. దేశంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోందన్నారు. అన్ని రంగాల్లో భారత్‌ అ‌గ్రగామిగా మారుతోందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *