ఇండస్ట్రియల్ అడిషనల్ డైరెక్టర్ను కలిసిన టీజీవో అధ్యక్షుడు

హైద్రాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: ఇండస్ట్రీస్ డిపార్టుమెంట్ అడిషనల్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ నాయక్ ను టీజీవో నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం.బి.కృష్ణ యాదవ్ తదితరులు బొకే అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగుల సహకారంతో ముందుకెళ్తానని తెలియజేశారు.…
