గద్దర్ పార్థివదేహానికి ముఖ్య మంత్రి నివాళులు..!
దివంగత గద్దర్ పార్థివ దేహానికి సోమవారం పుష్పాంజలి ఘటించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నివాళులు అర్పించారు.గద్దర్ ఆత్మకు శాంతిచేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చి ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ తో తనుకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు.