సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: ఉద్యోగులకు ప్రమాద బీమా, ఆరోగ్య పథకాలను ప్రకటించడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. టీజీవో, టీఎన్జీవో, రెవెన్యూ, ఉపాధ్యాయ, పెన్షనర్ల తదితర సంఘాల నాయకులు, ఉద్యోగులు ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మంగళవారం కలిశారు. తమ చిరకాల వాంఛను నెరవేర్చారంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.…
