దర్శకుడు, జర్నలిస్టు రఘురామ్ హఠాన్మరణం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుంది. ప్రముఖ దర్శకుడు, సీనియర్ జర్నలిస్టు బండి రఘురామ్ 56) కన్నుమూశారు. హైదరాబాద్ మధురానగర్లో నివాసముంటున్న ఆయన మంగళవారం వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే బంధువులు, సన్నిహితులు హాస్పిటల్కు తరలించినప్పటికీ అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు…
