వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి
పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: సర్వవిఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యులు, మాజీ డీప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం నందిగామ గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకులు విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో గణనాథుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.…
