Tag తెలుగు వార్తలు

ఈడి దాడుల్లో దొరికిన ఎకె 47 రైఫిళ్లు

రాంచీ,అగస్ట్ 24: ‌నగదు కోసం సోదాలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌కు ఏకే 47 ఆయుధాలు కనిపించాయి. సీఎం సహాయకుడి ఇంట్లోని ఓ అల్మారాలో ఈ రైఫిళ్లు బయటపడ్డాయి. ఝార్ఖండ్‌ ‌ముఖ్యమంత్రి హేమంత్‌ ‌సొరెన్‌ ‌సహాయకుడి ఇంటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌రెండు ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకొంది. అక్రమ మైనింగ్‌కు సంబంధించి మనీలాండరింగ్‌ ‌కేసును దర్యాప్తు…

కెమికల్‌ ‌ఫ్యాక్టరీలో పేలుడు

ఒకరు మృతి.. పలువురికి గాయాలు నల్లగొండ, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 24 : ‌జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ కెమికల్‌ ‌ఫ్యాక్టరీలో రియాక్టర్‌ ‌పేలడంతో ఈ ప్రమాదం చోటుచేకున్నట్లు చెబుతున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్‌ ‌సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసేందుకు ఫైర్‌ ‌సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో…

బీహార్‌లో రాజకీయ కలకలం

నితీశ్‌ ‌బలపరీక్షకు ముందే స్పీకర్‌ ‌రాజీనామా అవిశ్వాస తీర్మానం నోటీసులతో రాజీనామా చేసిన విజయ్‌ ‌కుమార్‌ ‌సిన్హా ఆర్జెడీ నేతల ఇళ్లపై సిబిఐ దాడులతో సర్వత్రాచర్చ దాడులకు భయపడేది లేదన్న మాజీ సిఎం రబ్రీదేవి పాట్నా, ఆగస్ట్ 24 : ‌బీహార్‌ ‌రాజకీయాలు మరోమారు చర్చగా మారాయి. ఓ వైపు నితీశ్‌ ‌బలపరీక్ష, అంతకుముందే స్పీకర్‌…

‘ఆటా’ ఆధ్వర్యంలో ఇండియా డే పెరేడ్‌

‌ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ఆగస్ట్ 24 : ‘‘‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ అసోసియేషన్స్(ఎఫ్‌ఐఏ) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో నిర్వహించిన ఇండియా డే పెరేడ్‌లో ‘‘అమెరికా తెలుగు ఆసోసియేషన్‌( ఆటా), న్యూయార్క్‌లో భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ఇండియా డే పెరేడ్‌లో పాల్గొనడం జరిగింది. ఈ ఇండియా డే పరేడ్‌లో యావత్‌…

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మగ్దూం మొహియుద్దీన్‌

‌నేడు మగ్దూం మొహియుద్దీన్‌ ‌వర్ధంతి హైదరాబాద్‌ ‌సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచమంతా గర్వించేలా, గౌరవించేలా తన గళం (ఉపన్యాసం) తోనూ, కలం తోనూ ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి మగ్దూం మొహియుద్దీన్‌. ‌భారత దేశంలో వచ్చిన ప్రగతి శీల రచయితల ఉద్యమానికి హైదరాబాద్లో జీవం పోసింది మఖ్దుమే. నాలుగు దశాబ్దాలకు పైగా కమ్యూనిస్టు ఉద్యమాలకు, సాహిత్య సృజనకు…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌డొంక తెలుగు రాష్ట్రాల్లో కదుతులున్న తీగ

స్కామ్‌పై స్పందించాలన్న బిజెపి ఎంపి జివిఎల్‌ ‌విశాఖపట్టణం, ఆగస్ట్ 24: ‌లిక్కర్‌ ‌స్కామ్‌పై దిల్లోలో డొంక కదిలితే ఆంధ్రా తెలంగాణాలో మూలాలు వెలుగు చూస్తున్నాయని ఎంపీ జీవీఎల్‌ ‌నరసింహారావు అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీకి సంబంధాలు వున్నట్లు తెలుస్తుందన్నారు. దీనిపై రెండు ప్రభుత్వాలు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.…

 ‌శిల అయిన మనసు

దిగుళ్ల దేహంలోకి దిగబడుతోన్న ఆకలి పలుగులతో పూటపూటకీ పురిటినొప్పులు పడుతోన్న పస్తుల ఉదరాల వేదన చూడలేక నుసిగామారుతున్నాయిజి రేపంటే మరో భయమే తప్ప ఆశలంటూ లేని బడుగుజీవి పేగుల పోగులు. ఉదయం జరిగిన సంఘటనే మదిని తొలిచేస్తోంటే కళ్ళుమూసుకున్నా… దూరంగా,దీనంగా గుండెల్ని పిండేసే ఒక హీన స్వరం. అది… ఒంగిన నడుమే చుక్కానిగా బతుకీడుస్తున్నజి ఒక…

తెలంగాణ సంస్కృతికి ప్రతీక ..

తెలంగాణ విముక్తి పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని పోరాడిన సాహితీకారుడు, తెలుగు భాషా ప్రవీణులు, తెలంగాణ వైతాళికులు దేవులపల్లి రామానుజ రావు గారు 25-8-1917లో వరంగల్‌ ‌జిల్లాలో దేశాయిపేటలో అండాలమ్మ వెంకటాచలపతి దంపతులకు జన్మించారు. వీరి ప్రాథమిక విద్య దేశాయిపేట లోను, ఉన్నత విద్య హనుమకొండలోను, నిజాం కళాశాల నుండి డిగ్రీ పట్టాను పొందాడు.తెలుగు భాషలో…

మునుగోడులో మునిగేది ‘లెఫ్ట్ ‌పార్టీలే ..!

దేశంలో కాంగ్రెస్‌కు అంతో ఇంతో ప్రజాదరణ ఉన్నా..కమ్యూనిస్టులకు ఆ మాత్రం ఆదరణ కూడా లేదు. పిడివాదం, పడికట్టు పదాలతో వారు చేస్తున్న పోరాటాలు ప్రజలను మెప్పించలేక పోతున్నాయి. అలాగే మునుపటిలా పోరాటాలు చేయడం లేదు. సమస్యలపై ఉద్యమించడం లేదు. ఉన్న ఒకరిద్దరు నేతలు తమ ఉనికిని చాటుకునే యత్నాల్లో ఉన్నారు. ఎప్పటికి ఏది అవసరమో అది…