ములుగు సరిహద్దుల్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-ఛత్తీస్గఢ్లోని పూజారి కాంకేర్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. తప్పించుకునే క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు…
