ఎస్ఐ కుటుంబానికి ఆర్థిక సాయం.. కుటుంబ సభ్యులకు చెక్కు అందించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
సైబరాబాద్, ప్రజాతంత్ర, జులై19 : దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న బొక్క ప్రభాకర్ రెడ్డి జూన్ 8వ,2023న గుండెపోటు తో మరణించారు. కాగా 2014 బ్యాచ్ కు చెందిన ప్రభాకర్ రెడ్డి గతంలో దారూర్, యాలాల్, తాండూర్, కొడంగల్ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. ఆయనకు భార్య, కూతురు అక్షయ ఉన్నారు.…
