ఎలాంటి బాంబులకైనా భయపడేది లేదు..

పొంగులేటి వ్యాఖ్యలపై కెటిఆర్‌ ‌స్పందన

‌దీపావళికి ముందే బాంబులు పేలుతాయన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఎవ్వరూ దీనికి భయపడరని అన్నారు. అయన పై జరిగిన ఈడీ రైట్స్ ‌కావచ్చని ఎద్దేవా చేశారు. లేదా సీఎం రేవంత్‌ ‌రెడ్డి బావమర్దికి సంబంధించిన కేసులు కావన్నారు. ఎం చేస్తారో చేసుకోండని చెప్పారు. ఈ చిట్టి నాయుడు ఏం చేస్తాడని, చిల్లర కేసు పెట్టి జైలుకి పంపిస్తారు కావొచ్చు అంతే అన్నారు.

నిజమైన బాంబులకే భయపడలేదు, మ‌రోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై ఫైర్ అయ్యారు. ఆయనో రాజకీయ వ్యభిచారని విమర్శించారు. జగిత్యాలలో కాంగ్రెస్‌ ‌నాయకులే ఒకరినొకరు చంపుకుంటున్నారని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి పని చేస్తున్నారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *