11న సిజెఐగా జస్టిస్‌ ‌ఖన్నా ప్రమాణం

ఆరు నెలలపాటు పదవిలో కొనసాగ‌నున్న ఖన్నా

‌భారత  సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా నియామకానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఆయన ఈ నెల 11న బాధ్యతలు చేపట్ట‌నున్నారు. ఆయ‌న‌ కేవలం ఆరు నెలలు మాత్రమే పదవిలో కొనసాగుతారు.

ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్‌ ‌ఖన్నా, ప్రస్తుత సిజెఐ చంద్రచూడ్‌ ‌పదవీ విరమణ తర్వాత నవంబర్‌ 11‌న ఆ పదవిని చేపట్టనున్నారు. జస్టిస్‌ ‌చంద్రచూడ్‌ ఇప్పటికే జస్టిస్‌ ‌ఖన్నా పేరును తుదిపరి ప్రధాన న్యాయమూర్తి పదవికి  సిఫార్సు చేశారు. ప్రస్తుత న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ 65 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసిన ఒక రోజు తర్వాత, నవంబర్‌ 11‌న జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

జస్టిస్‌ ‌చంద్రచూడ్‌ ‌నవంబర్‌ 8, 2022‌న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్‌ ‌ఖన్నా నియామకానికి ప్రభుత్వ ఆమోదాన్ని ధ్రువీకరిస్తూ, కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్‌ ‌రామ్‌ ‌మేఘవాల్‌ ఎక్స్ ‌ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. జస్టిస్‌ ‌ఖన్నా 183 రోజులు మాత్రమే సీజేఐ ఉండనున్నారు.

అంటే ఆయన కేవలం ఆరు నెలలు మాత్రమే ఈ పదవిలో ఉంటారన్నమాట. అతను మే 13, 2025న పదవీ విరమణ చేయనున్నారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి హన్స్ ‌రాజ్‌ ‌ఖన్నా మేనల్లుడు జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా జబల్‌పూర్‌ ‌కేసులో ఇచ్చిన తీర్పుతో ఆయన ప్రసిద్ధి చెందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *