రూ.45 వేల కోట్లతో  కొత్తగా నాలుగు పథకాలు

  • అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలి.
  • ప్రతి గ్రామంలో లబ్దిదారుల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి
  • ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
  • సంక్షేమ ప‌థ‌కాల‌ అమలుపై సమీక్ష

పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలని ఉప ముఖ్యమంత్రిఆర్థికఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం రైతు భరోసాఇందిరమ్మ ఆత్మీయ భరోసాఇందిరమ్మ ఇండ్లునూతన రేషన్ కార్డుల జారీ కార్యక్రమాల అమలు పై  ఖమ్మం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌.. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డితుమ్మల నాగేశ్వరరావుపొంగులేటి శ్రీనివాసరెడ్డిఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితీశ్ వి. పాటిల్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం వొచ్చిన తర్వాత  యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాల నిర్మాణంమెస్ చార్జీలు 40 శాతంకాస్మొటిక్ చార్జీల పెంపుమహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణంరూ.10 లక్షల ఆరోగ్య శ్రీ,  200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500ల‌కేగ్యాస్ సిలిండర్ వంటి అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు.  రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామనిసన్నవ‌డ్ల‌కు రూ. 500 బోనస్ అందించామన్నారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల జారీఇందిరమ్మ ఇండ్లురైతు భరోసాఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి 4 కొత్త పథకాలను  గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయాలని నిర్ణయించిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *