కేటీఆర్‌కు ఈడీ మరోసారి నోటీసులు

16న విచారణకు రావాలని ఆదేశం
‌ఫార్ములా ఈకార్‌ ‌రేసింగ్‌ ‌కేసులో కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఈడీమరోసారి నోటీసులు ఇచ్చిందిఈ నెల 16న విచారణకు రావాలని కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిందివాస్తవానికి ఈడీ ఎదుట కేటీఆర్‌ ‌మంగళవారం హాజరు కావాల్సి ఉందిఅయితేఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ‌రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వ్‌లో ఉందని తెలిపారుహైకోర్టుపైనున్న గౌరవంతో.. తీర్పును వెలువరించేంత వరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని కోరారుఈ మేరకు ఈడీకి కేటీఆర్‌ ‌సమాధానం పంపారు.

అయితే ఫార్ములాకార్‌ ‌రేస్‌ ‌వ్యవహారంలో తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్‌ ‌దాఖలు చేసిన క్వాష్‌ ‌పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిందిఈ వ్యహారంలో ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం క్వాష్‌ ‌పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చిందిఅరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యతంర ఉత్తర్వులను ఉపసంహరించుకుంది ఈ క్రమంలో ఈడీ తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేసి 16న విచారణకు రావాలని కేటీఆర్‌ను ఆదేశించింది

హైకోర్టు తీర్పుపై కేటీఆర్‌ ‌సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారుదీనిపై నందినగర్‌లోని తన నివాసంలో తన లీగల్‌ ‌టీమ్‌లో చర్చిస్తున్నారుసిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుఎమ్మెల్సీ కవితమాజీ మంత్రులతో సమాలోచనలు చేస్తున్నారుకాగాక్వాష్‌ ‌పిటన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో బీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *