అనర్హులకు ఇళ్లు వొస్తే కలెక్టర్లదే బాధ్యత

మంత్రి కోమటిరెడ్డి సున్నితంగా హెచ్చరిక
అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాల్సి ఉందని,  భవనాలు ఉన్న వారికి ఇళ్లు ఇస్తే మొదటి బాధ్యులు కలెక్టర్‌ అవుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు. అర్హులైన వారికి ఇళ్లు రావాలన్నారు. అధికారులుసిబ్బంది కీలక పాత్ర వహించాల్సి వుంటుంది.. అధికారులుసిబ్బంది అలసత్వం ఉండొద్దు.. గ్రామాలు  ఇళ్లు అనుకుని పని చేయండ‌ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి సూచించారు. ఖ‌మ్మం జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భోగిసంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆకస్మిక పర్యటనలు ఉంటాయని తెలిపారు.

అక్రమాలు జరుగకుండా చూడాలన్నారు. అలాగేప్రజా పాలనలో ప్రజలు ఎంతో ఆశతోనమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు అని రోడ్లుభవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి తెలిపారు. వారి కోసం ఒక్కొక్కటిగా పని చేసి పెడుతున్నాం.. ఇందిరమ్మ భరోసాఇందిరమ్మ ఇళ్లురైతు భరోసా లాంటి కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేస్తామన్నారు. దీనికి గాను సీఎం రేవంత్‌ ‌రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు.

దానికి మంత్రులుఅధికారులు అందరు హాజరయ్యారు.. ప్రతి అర్హుడైన పేదవాడికి న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వం చూస్తుందన్నారు. అర్హుడైన ప్రతి రైతుకు రైతు భరోసా అందిస్తాం.. రెవెన్యూ మంత్రి కూడ ఖమ్మం జిల్లాకు చెందిన వాడే ఆయన దగ్గర ఉండి మరి కు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తారు.. 16 నుంచి 26 వరకు అధికారులు కష్టపడిప్రతి గ్రామానికి వెళ్ళి సర్వే చేయాలి.. పేదలకు ఇళ్లు అందేలా చూడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *