Category గెస్ట్ ఎడిటర్

కెసిఆర్‌ అం‌తిమ ఫర్మానా ..!

భారతీయ జనతాపార్టీ వరంగల్‌లో సభను అడ్డుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఫర్మానా జారీ చేశారో అదే ఆయన అంతిమ ఫర్మానా అవుతుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా జ్యోస్యం చెప్పారు. గతంలో నిజామ్‌ ‌సర్కార్‌ ఇక్కడి ప్రజలు సభలు, సమావేశాలు పెట్టుకోకుండా, లైబ్రరీలు, పాఠశాలలు నిర్వహణపై అంకుశం మోపుతూ ఇలాగే ఫర్మానా జారీ చేస్తే,…

సిట్టింగ్‌ ‌స్థానంకోసం కాంగ్రెస్‌.. అధికారంకోసం బిజెపి.. ప్రతిష్టగా టీఆర్‌ఎస్‌

మునుగోడు ఉప ఎన్నికల అన్ని రాజకీయ పార్టీల్లో టెన్షెన్‌ ‌పెంచింది. రానున్న శాసనసభ ఎన్నికలకు ఈ ఎన్నిక సెమీఫైనల్‌ అని పార్టీలన్ని భావిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ ‌తన సిట్టింగ్‌ ‌స్థానాన్ని ఏ విధంగానైనా పదిలపర్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో సాధించుకున్న స్థానాల్లో అధికశాతం స్థానాలు ఆ  పార్టీ చేజారిపోయాయి. ఇప్పుడు మిగిలింది అయిదుగురు…

ఒకవైపు బుజ్జగింపు .. మరోవైపు రాజీనామాకు డిమాండ్‌

మునుగోడు ఎంఎల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీలో సునామీ సృష్టిస్తోంది. ఈ విషయం ఇప్పుడాపార్టీకి కక్కలేక మింగలేకుండా ఉన్నది. స్వీయపార్టీపై చేసిన విమర్శలకు ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డిమీద చర్యలు తీసుకోవాల్సిన అధిష్టానం ఆచీతూచి వ్యవహరిస్తున్నది. పైగా ఆయన్ను ఏదో విధంగా  బుజ్జగించి పార్టీలోనే కొనసాగేట్లు చూసేందుకు నానా తంటాలు పడుతున్నది. అందుకోసం దిల్లీ  స్థాయి సీనియర్‌…

ఆత్మప్రబోధంతోనే వోటువేయండి

రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రబోధంతోనే వోటు వేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆర్హులైన తమ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. గతంలో వివి గిరి రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ఇందిరాగాంధి పిలుపునిచ్చినట్లుగానే ఆత్మప్రబోధంతో తమ వోటును సద్వినియోగం చేసుకోవాలంటూ ఎంపిలకు, ఎంఎల్‌ఏలకు కెసిఆర్‌ ‌ప్రబోధించారు. రాష్ట్రపతి డాక్టర్‌ ‌జాకీర్‌ ‌హుసేన్‌ అకస్మాత్తుగా 1969…

అగ్నిజ్వాలలను లేపిన అగ్నిపథ్‌

‌నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ ‌పథకం అగ్ని వర్షాన్ని కురిపిస్తున్నది. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా యువత ఆగ్రహానికి కేంద్ర, రాష్ట్ర ఆస్థులు ధ్వంస•మవుతున్నాయి. ఎట్టి పరిస్థితిలో కేంద్రం ఈ పథకాన్ని వెనక్కు తీసుకోవాలని నిరుద్యోగ యువత డిమాండ్‌ ‌చేస్తుండగా, కేంద్రం మాత్రం యువతకు ఉపాధి అవకాశాలను…

ఎన్‌కౌంటర్‌లకు కూడా వెరవని రేపిస్టులు

అత్యాచారాలకుపాల్పడితే ప్రాణాలు కోల్పోతామన్న భయంకూడా లేకుండా పోతోంది రేపిస్టులకు. అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ పలు సంచలనాత్మకమైన సంఘటనలు జరిగినప్పుడు నిండు ప్రాణాలను కోల్పోయిన యువకులను చూసైనా గుణపాఠం నేర్చుకునే పరిస్థితి  కనిపించడంలేదు. నేటికి సరిగ్గా పదేళ్ళ కింద దిల్లీలో  జరిగిన నిర్భయ కేసు విషయంలోనైతేనేమీ, 2008లో వరంగల్‌లో జరిగిన యాసిడ్‌ ‌సంఘటనకు సంబంధించి  నలుగురు…

కాంగ్రెస్‌ ‌పార్టీ రైతు రచ్చబండ

కాంగ్రెస్‌పార్టీ చేపట్టిన రైతు రచ్చబండకు అనూహ్య స్పందన వొస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రైతాంగం ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం గమనార్హం. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను కాంగ్రెస్‌ ‌నాయకులకు ఏకరువు పెడుతున్నట్లు వార్తలు వొస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో రాహుల్‌ ‌గాంధీ పర్యటన తర్వాత కాంగ్రెస్‌ ఒక విధంగా దూకుడు పెంచిందనే…

అమిత్‌షా సభపై బిజెపి ఆశలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర బిజెపి నాయకత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇంతవరకు రాష్ట్రంలో బిజెపి చేస్తున్న సభలు, సమావేశాలు, పాదయాత్రలకు ఈ సభ భిన్నంగా  ఉండాలనుకుంటున్నారు. వారం రోజుల కిందనే కాంగ్రెస్‌ ‌పార్టీ రాహుల్‌తో వరంగల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయవంతం అయిందని ఆ వర్గాలు…

రాష్ట్రంలో రాజకీయ పార్టీల హడావుడి

రాష్ట్రంలోరాజకీయ పార్టీల హడావుడి పెరిగింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజా క్షేత్రంలోకి పరుగులు పెడుతున్నాయి. ఒక విధంగా ముందస్తు ఎన్నికలకు ఈ పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయా అనిపిస్తున్నది. రాష్ట్రంలో ముందుస్తు ఎన్నికలకు అవకాశంలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించినప్పుడు ఎన్నికలు తరుముకొస్తున్నట్లుగానే ఉంది.…