Category ముఖ్యాంశాలు

పోలీసుల అదుపులో లగచర్ల ఘటన 52 మంది

today breaking news, telugu short news

అధికారులను తరిమికొట్టిన రైతులను విచారిస్తున్న పోలీసులు ‌లగచర్ల ఘటనలో 52 మందిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఏస్పీ నారాయణరెడ్డి  తెలిపారు. అధికారులపై దాడి ఘటనలో కుట్ర కోణంపై విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారులపై దాడి చేసిన వారిలో సురేష్‌ ‌కీలకంగా వ్యవహరించారన్నారు. రాజకీయ కోణంలో కూడా విచారణ చేస్తున్నామని, విచారణలో అన్ని విష‌యాలు తెలుస్తాయన్నారు. కాగా, తమ భూములు గుంజుకునే…

Lagacharla Pharma incident బిఆర్‌ఎస్‌ ‌డైరెక్షన్‌లో లగచర్ల ఫార్మా ఘటన!

Lagacharla Pharma incident

దాడిలో బిఆర్‌ఎస్‌ ‌నేత పట్నం నరేందర్‌ ‌రెడ్డి అనుచరుడు ఘటనపై ఆరా తీసిన మంత్రి శ్రీధర్‌ ‌బాబు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్న పోలీసులు ‌ఫార్మా భూసేకరణ సందర్భంగా వికారాబాద్‌ ‌జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్‌, ‌పలువురు అధికారులపై దాడి బిఆర్‌ఎస్‌ ‌కుట్రగా బయటపడుతోంది. దాడిలో పాల్గొన్న వారంతా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లిన‌ట్లు పోలీసులు గుర్తించారు.…

Formula E-race scam క‌లెక్ట‌ర్ పై దాడికి ఉసిగొల్పిన‌ వారిని వ‌దిలిపెట్టేది లేదు..

ఎంతటి వారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 12 :  ఫార్ములా ఈ రేసు స్కామ్‌లో గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ మీడియా ఛానల్‌తో ఆయన మాట్లాడారు. వికారాబాద్ కలెక్టర్‌పై…

ప్ర‌జా విజ‌యోత్స‌వాలకు ఏర్పాట్లు ముమ్మ‌రం..

Arrangements are being made for Praja Vijayotsavam

ఎల్ఈడీ స్క్రీన్లు, షామియానాలు, మెడిక‌ల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లు, ఎల్బీ స్టేడియంలో అతిథులుకు స‌క‌ల వ‌స‌తులు ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన  ఉన్నతాధికారులు హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో  ఈనెల 14న నుంచి ప్రారంభం కానున్న ప్రజా విజయోత్సవాలకు సంబంధంచిన‌ ఏర్పాట్లను ప్రభుత్వ ఉన్న‌తాధికారులు మంగళ వారం సాయంత్రం పరిశీలించారు. సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్. ఎస్.హరీష్, ప్రోటోకాల్…

ట్రబుల్‌ షూటర్‌కు బిజెపి గాలం..?

(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రతినిధి) నిత్యం ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే రాజకీయ పార్టీలు అకస్మాత్తుగా ఎదుటి పార్టీ నాయకుడిపై ప్రశంసలు కురిపించడమేంటి? దాని వెనుక రాజకీయ ఎత్తుగడ ఏద్కెనా ఉందా? లేక ప్రత్యర్థి పార్టీలో వైషమ్యాలను కలిగించేందుకా అన్నదిప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిరది మొదలు ఈ పదకొండు ఏండ్ల కాలంగా భారతీయ జనతాపార్టీ (బిజెపి) భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)పై నిత్యం దిమ్మెత్తిపోస్తూనే ఉంది. బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగిన పదేళ్ల కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన వివిధ ప్రాజెక్టులపై కేవలం బిజెపి రాష్ట్ర నాయకత్వమే కాదు.. సాక్షాత్తు ప్రధాని లాంటివారు కూడా నేటికీ తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్న విషయం తెలియంది కాదు. కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులు బిఆర్‌ఎస్‌కు ఏటిఎంగా మారాయని ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించినప్పుడల్లా ఆరోపిస్తూనే వొచ్చారు. అసలు తెలంగాణ విభజనే సరైంది కాదంటూ పలుసార్లు పలు వేదికలపై ఆయన పేర్కొనడాన్నిబట్టి, తెలంగాణపై ఆయన అయిష్టత స్పష్టమైంది. అది మొదలు తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాడన్న అపవాదను ఆయన మూటకట్టుకున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న బిఆర్‌ఎస్‌, బిజెపితో నేటికీ ఉప్పులో నిప్పుగానే మసలుతున్నది. ఈ క్రమంలో బిఆర్‌ఎస్‌ పార్టీలోని ఓ ముఖ్యనేతపై బిజెపి ప్రశంసలు కురిపించడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. బిజెపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌, సిద్దిపేట బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావును మెచ్చుకోవడం బిఆర్‌ఎస్‌ పార్టీ వర్గాల్లో అయోమయానికి దారితీసింది. బిఆర్‌ఎస్‌లో క్రెడిబులిటీ ఉన్న నాయకుడు హరీష్‌రావు మాత్రమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. అదే సమయంలో బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహణ అధ్యక్షుడు కె.టి. రామారావును ఆయన తీవ్రంగా విమర్శించడం చూస్తే ఆ పార్టీలో విబేధాలు సృష్టించి బలహీనపర్చే యత్నంలో భాగమా అన్న అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ఇటీవల ఆయన మీడియా చిట్‌చాట్‌లో కెటిఆర్‌ను అహంకారి అని, అక్రమ సంపాదన వల్లే ఆయనకు అహంకారం పెరిగిందని విమర్శిస్తూనే, హరీష్‌ను బిజెపిలోకి ఆహ్వానిస్తారా అన్న ప్రశ్నకు అవునని స్పష్టంగా చెప్పకుండా, ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించే నిర్ణయం తానొక్కడిని తీసుకునేదికాదని, పార్టీ వర్గాలందరు కలిసి తీసుకోవాల్సి ఉందంటూ నర్మగర్భంగా చెప్పడం వెనుకున్న అర్థాన్ని వెతుకుంటున్నారు. వాస్తవంగా గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఓటమిపాల్కెనప్పటి నుంచి హరీష్‌ విషయం తరచూ చర్చకు వొస్తూనే ఉంది. ఆయన పార్టీ వీడుతారని, బిజెపిలో చేరుతాడంటూ అనేక వదంతులు వొచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ప్రధాన భూమిక (ఖీ2వ పేజీలో...) పోషిస్తూ వొచ్చిన హరీష్‌రావుకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. కేవలం పార్టీలోనే కాకుండా ఇతర పార్టీల నాయకులతో కూడా ఆయన స్నేహపూర్వకంగా ఉంటాడన్న పేరుంది. ముఖ్యంగా బిఆర్‌ఎస్‌లో ఎప్పుడు ఎలాంటి సంక్షోభం వొచ్చినా ‘ట్రబుల్‌ షూటర్‌’గా సమస్యలను చాకచక్యంగా పరిష్కరించే నేర్పరిగా ఆయన ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. అన్నిటికీ మించి మాస్‌ లీడర్‌గా, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుండడంతో ఆయన ఇల్లు ఎప్పుడు చూసినా కార్యకర్తలు, అభిమానులతో కోలాహలంగా ఉంటుంది. అలాంటి వ్యక్తిని బిఆర్‌ఎస్‌ పార్టీకి దూరం చేయడానికి బండి సంజయ్‌ వేసిన ఎత్తుగడ అయి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెసిఆర్‌ను, కెటిఆర్‌ను ఏదో ఒక అంశంవైన విమర్శించే బండి సంజయ్‌ క్రెడిబులిటీ ఉన్న నాయకుడిగా హరీష్‌ను అనాలోచితంగా మెచ్చుకున్నదేమీ కాదు. వ్యూహాత్మకంగానే అని ఉంటారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలాఉంటే బిజెపిలాగా కాంగ్రెస్‌ కూడా హరీష్‌కు గాలం వేసేపనిలో ఉందా అన్న అనుమానానికి ఇటీవల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మాటలు అదే ధోరణిలోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కెసిఆర్‌ పని అయిపోయిందంటున్న రేవంత్‌రెడ్డి, కెటిఆర్‌తో కెసిఆర్‌ను ఫినిష్‌ చేశామని, ఇక బావతో బావమరిదిని అంటే హరీష్‌రావుతో కెటిఆర్‌ను ఫినిష్‌ చేయనున్నామని, అ తర్వాత హరీష్‌రావును ఎలా మలుచుకోవాలో తమకు తెలుసంటూ చేసిన వ్యాఖ్యల వెనుక అర్థాన్ని ప్రజలు విశ్లేషించుకుంటున్నారు. మొత్తానికి ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న హరీష్‌రావుకు వీరిద్దరి మాటలు పెద్ద ట్రబుల్‌ల్లోనే పడేసినట్లు కనిపిస్తున్నాయి.

బిఆర్‌ఎస్‌ క్యాడర్‌ను బలహీనపర్చేందుకా ? క చర్చకు దారితీస్తున్న బండి సంజయ్‌ వ్యాఖ్యలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రతినిధి): నిత్యం ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే రాజకీయ పార్టీలు అకస్మాత్తుగా ఎదుటి పార్టీ నాయకుడిపై ప్రశంసలు కురిపించడమేంటి? దాని వెనుక రాజకీయ ఎత్తుగడ ఏద్కెనా ఉందా? లేక ప్రత్యర్థి పార్టీలో వైషమ్యాలను కలిగించేందుకా అన్నదిప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా…

అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ?

రైతుల జీవితాలతో కాంగ్రెస్‌ ‌చెలగాటం.. కొనుగోళ్లపై నిర్లక్షంతో పంటలు బాగా పండినా అమ్ముకోలేని స్థితి మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11: ‌రాష్ట్రంలో పంటలను మద్దతు ధరలకు అమ్ముకోలేని స్థితి నెలకొందని, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తీరుతో రైతులకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఎక్స్ ‌వేదికగా మండిపడ్డారు. అకాల…

Minister Damodara నిమ్స్‌లో విద్యార్థినులకు మంత్రి దామోదర పరామర్శ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ‌రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్‌ ‌రాజనర్సింహ నిమ్స్ ‌హాస్పిటల్‌ ‌ను సందర్శించారు. కొమురంభీం ఆసిఫాబాద్‌ ‌జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు మహాలక్ష్మి, జ్యోతి, శైలజ విద్యార్థినిలు వాంతులు విరోచనాలతో కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ కోలుకున్న విషయం…

అడ్డగోలు నిర్ణయాలతో రైతులు ఆగం

Tsnews latest updates ,today breaking news, telugu short news

చేతకానప్పుడు హామీలు ఎందుకివ్వాలి? ఏడాది పాలనలో వొచ్చిన లాభం ఏంటి? బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చేతకాని హామీలు ఇచ్చారని, కానీ ఇప్పుడు అవి అమలు చేయాలంటే సీఎం రేవంత్‌కు తలపానం తోకలోకి వొస్తుందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. చేతకానప్పుడు అసలు…

Supreme Chief Justice ‘‌సుప్రీమ్‌’ ‌చీఫ్‌ ‌జస్టిస్‌గా సంజీవ్‌ ‌ఖన్నా

Sanjeev Khanna as Supreme Chief Justice

ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరైన ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌తదితరులు న్యూదిల్లీ, నవంబర్‌11 (ఆర్‌ఎన్‌ఎ): ‌భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగాజస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నాతో.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు..   సీజేఐగా జస్టిస్‌ ‌డి.వై.చంద్రచూడ్‌…