Category శీర్షికలు

పదవుల కోసం పడిగాపులు

మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవులతోపాటు కొత్తగా పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కాంగ్రెస్‌ హై కమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఉన్నత పదవులను దక్కించుకునేందుకు నాయకగణమంతా క్యూ కడుతున్నారు. తమకు అనుకూలురైన రాష్ట్ర, కేంద్ర నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.  కొందరైతే ఏకంగా కొద్ది రోజులుగా దిల్లీలోనే మకాం పెట్టినట్లు తెలుస్తున్నది. పదేళ్ళ తర్వాత తమ…

మాదక ద్రవ్యాలను తరిమేద్దాం !

గంజాయి, నల్లమందు, కొకైన్‌, మార్ఫిన్‌, హెరాయిన్‌, ఎల్‌ఎస్‌డీ (లైసెర్జిక్‌ యాసిడ్‌ డైఈథాలమైడ్‌), బ్రౌన్‌సుగర్‌, ఎండీఎంఏ (మీథైల్‌ఎనడయాక్సీ-మెథాంఫెటామైన్‌) వంటి వాటిని  మాదకద్రవ్యాలు అంటారు. ఇవి శరీరంలోనికి పీల్చడం లేదా నోటిద్వారా లేదా ఇంజక్షన్‌ రూపంలో తీసుకుంటారు. వీటిని సేవించడం వలన ఆరోగ్యపరంగా యెన్నో అనర్థాలు ఉండడం వలన  ప్రపంచ వ్యాప్తంగా నిషేధించారు. ఎక్కువ శాతం సంపన్నవర్గాల యువత…

మౌలిక ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ జరగాలి!

ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ గురించి అన్వేషణ జరగా లన్నది జాతీయభావ నిష్ఠులు చెబుతున్న మాట.  నిజానికి ఈ ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ ‘ప్రత్యామ్నాయం’  ఆల్టర్‌నేటివ్‌  కాదు, ఇది మౌలికమైన  ఒరిజినల్‌  ఆర్థిక వ్యవస్థ. అనాదిగా ఈ వ్యవస్థ మన దేశంలో అలరారింది. ఈ వ్యవస్థ స్వభావం ఉత్పత్తిదారుల సమాజం అవసరాలను తీర్చడం. ఈ వ్యవస్థ స్వరూపం…

ముంచుకొస్తున్న పర్యావరణ విలయం!

ప్రపంచమంతటా విపత్కర పరిస్థితి మానవాళికి పెనుముప్పుగా కాలుష్య రసాయనాలు అడవుల పాలిట, వ్యవసాయ క్షేత్రాల పాలిట, జంతు జాలం పాలిట, సమస్త జీవజాలం పాలిట ప్రపంచీకరణ ‘గొడ్డలి’గా మారింది. ప్రపంచీకరణ, వాణిజ్య పారిశ్రామిక కేంద్రీకరణ పర్యావరణానికి ప్రబల శత్రువులుగా మారాయి. అడవులను ధ్వంసం చేయడం వల్ల, విచ్చలవిడిగా మాంసాహారాన్ని భుజించడం వల్ల ప్రపంచ పర్యావరణ సమతుల్యత…

‘అసలే పితృస్వామ్యం, ఆపై మద్యం…

(గత సంచిక తరువాయి) ‘‘పెరుగుతున్న కుటుంబ హింస’ – సారా వ్యతిరేక, మద్య నిషేధ ఉద్యమంలో రాజ్య నిర్భందాన్ని, గుండాల దాడిని ఎదుర్కొన్న ‘పీవోడబ్ల్యూ’ కార్యకర్తలు’’ సజయ : అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమం రాష్ట్రమంతా వుధృతంగా వ్యాపించటంలో ‘పీవోడబ్ల్యూ’ పాత్ర చాలా కీలకమైనదిగా చెబుతారు. మీరు ఎక్కడెక్కడ క్రియాశీలకంగా…

అవయవ దానాలపై అవగాహన అవసరం

సమకాలీన వైద్యశాస్త్రం సాధించిన అద్భుతమైన ఆవిష్కరణ అవయవ మార్పిడి పద్ధతి. అవయవ మార్పిడి ద్వారా దాతల శరీరం నుంచి సేకరించిన అవయవాలను అవయవ లోపాలతో బాధపడుతున్న రోగులకు అమర్చి, వారికి స్వస్థత కలిగించే విధానం  నానాటికీ పురోగతి సాధిస్తున్నది. అవయవ దాతల సంఖ్య కూడా అవసరాలకు తగినంతగా కాకపోయినా, నెమ్మదిగా అధికం అవుతున్నది. అన్ని దానాల…

ఆత్మవిమర్శ చేసుకోవాలి!

ఈ ఎన్నికలు కెసిఆర్‌- జగన్‌తో పాటు, మోదీకి  కూడా గుణపాఠం లాంటివే మోదీ  బాణం కూడా గురితప్పింది తప్పంతా ప్రజలదే అన్నట్టుగా ఆత్మవంచనకు పాల్పడుతున్నారు మంచి పాలనే ఇస్తే ప్రజలెందుకు ఓడిస్తారు.. విపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి.   తెలంగాణలో కెసిఆర్‌ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మళ్లీ మనదే అధికారం అంటూ పార్లమెంట్‌ ఎన్నికల ముందు ప్రగల్భాలు…

పోలవరం ప్రాజెక్టుకు పాతర వేసిన బీజేపీ సర్కార్‌!

ఆంధ్రప్రదేశ్‌ పేరు చెబితే చాలు మొదట అమరావతి, రెండు పోలవరం ప్రాజెక్టు గురించి తరచుగా వింటాం. డ్యామ్‌ ల నిర్మాణం వల్ల సముద్రంలో జలాలు వృథాగా పోకుండా, కాల్వలు కట్టి పొలాలకు నీళ్లు వదులుతారు. దీని వల్ల ఆర్ధిక సంపద పెరుగుతుంది. వ్యవసాయం పండుగవుతుంది. అంతేకాని ఈ అంశంపై రాజకీయాలు చేయడం ఏ పార్టీకి కూడా…

రుణమాఫీ సరే… ఆరు నెలలుగా రైతు బాధల సంగతేమిటి?

అనర్హుల పేరిట రైతు బంధు పంపిణీలో తీవ్ర జాప్యం రాష్ట్ర ప్రభుత్వంపై బిఆర్‌ఎస్‌ విమర్శలు రైతుల రుణ మాఫీ విషయంలో కొంతకాలంగా జరుగుతున్న చర్చలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తెరదించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన అనంతరం ప్రకటిం చినట్లుగా ఆగస్టు 15లోగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసేవిధంగా శుక్రవారంనాటి…