Category శీర్షికలు

దశాబ్ది తెలంగాణ కథ – గిరిజన జీవనం  4

(2014-2023) (గత సంచిక తరువాయి భాగం) చందు తులసి రాసిన ‘‘నీళ్ళబిందె’’ (2018) కథ పట్టణాలలో వలసకూలీ జీవితం గడుపుతున్న లంబాడీ స్త్రీలు గుక్కెడు నీళ్ళకోసం ప్రతిరోజూ యుద్ధం చేయాల్సి వస్తున్న స్థితిని చిత్రించింది. ‘‘జీవితం నదిలా కాకున్నా కనీసం మురికికాలువలాగానైనా గడుస్తుందని ఆశపడి తండానుండి నగరానికి చేరుకుంటే అక్కడ తాగడానికి కూడా చుక్కనీళ్లు దొరకక…

పాలు-నీళ్ళు!

‘పాలల్లో నీళ్ళు బాగా కలిపేస్తున్నావ్?’ చికాకు పడుతూ అంది వో యిల్లాలు. ‘మా గేదెకూడా నీళ్ళు తాగుతుంది,’ చెప్పాడు పాలవాడు. ‘మరీ యెక్కువ నీళ్ళు తాగేస్తోంది,’ అంది యిల్లాలు. ‘ఎండాకాలం కదండీ?’ అన్నాడు పాలవాడు. ‘మీ గేదెకి గడ్డి వుంచట్లేదా?’ యిల్లాలు తగ్గలేదు. ‘అందరూ నానా గడ్డీ కరుస్తుంటే, పశువులకి గడ్డెక్కడ దొరుకుతుందీ?’ పాలవాడూ తగ్గలేదు.…

అతడు ఆమె

ముఖమంతా సెగలైనా లోపల భీకర వర్షం బొట్టు చప్పుడు లేకుండా భారీ వరద ఊపిరిని తాకేలా దారుల్ని మింగేసిన నదిపై చినుకు ఈతను చూస్తుంటే ఏ క్షణంలో ఏ పదం పెదవులను పగులగొట్టుకుని ముక్కలవుతుందో లోపలి నిజం అనిపిస్తుంది ఎన్నో యేళ్ళగా గేట్లు తెరవని ఆనకట్టలా అతడు ఒళ్ళంతా నెర్రెలుబారి విశాలమైన బీడులా ఆమె -శ్రీ…

లోపలి నాటకం

కాలానికి  సైతం నచ్చని నిజమొకటి ఉంది నాలో దాని ఈర్ష్య ఓ పరీక్ష కొలిచినా చిన్నచూపే కలసిరాని పగ దానిది రుచిని వేధిస్తు ఆకలిని నిషేధిస్తుంది ఆశకు విలువ లేకుండా చేసి మంచిని నటిస్తు దేన్నీ రానివ్వదు బలగాలతో  బలం చూపుతుంది రేపు ఏదో ఓ రోజు తను పల్లకీగా మారుతానని తెలిసే ఈ లోపల…

మాన్యత పొందిన కథలు

కథలు అన్నీ చివరి మజిలీగా ‘కంచి’కి పోవు. కొన్నికథలని చదివాక అవి ఎటుపోకుండా పాఠకుడి మనసులో ఇంకిపోతాయి. సందర్భాన్ని బట్టి అవి మళ్ళీమళ్ళీ మననానికి వస్తాయి. అలా మననానికి వచ్చిన ప్రతిసారి పాఠకుడు ‘ఎంత బాగా రాశాడీ రచయిత’ అని అనుకోకుండా ఉండలేడు. బద్రి నర్సన్ కథా సంకలనం ‘దారి తెలిసిన మేఘం’ చదివాక పాఠకులు…

దండన!

‘ఏటమ్మా యిది! బంగారంలాంటి వయిసిన గుంటకి గుండు సేస్సినారు? లచ్చిందేవిలాగ వుండీది పిల్ల…’ ముసల్ది ముక్కున వేలేసుకుంది. ‘ఏం లేదు, సిమ్మాచలం మొక్కువున్ను గదా?!’ అని ఆ పిల్ల అమ్మమ్మ గబుక్కున ఆ పిల్లని యింట్లోకి తీసుకువెళ్ళిపోయింది. నూతి దగ్గర నీళ్ళబిందె యెత్తుకుంటుంటే, ‘అవునే కోడలా పిర్రలు దాటి కొండసలవలాగ వుండీది జుట్టు, గుండేమే?’ నల్లగ…

దశాబ్ది తెలంగాణ కథ – గిరిజన జీవనం 3 (2014-2023)

(గత సంచిక తరువాయి భాగం) దిలావర్‌ రాసిన ‘పాటకు మరణం లేదు’ (2015) కథ రక్షకులే భక్షకులై గిరిజనుల జీవితాన్ని బుగ్గిపాలు చేయడాన్ని సూచిస్తుంది. అడవిలో పోడు వ్యవసాయం చేస్తూ, ప్రకృతితో మమేకమై పాటలు పాడుకునే కోయయువకుడిని పోలీసులు పట్టుకెళ్ళి స్టేషన్లో పెడుతారు. ఆ యువకుని చెల్లెలు చెంద్రి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే హెడ్‌ కానిస్టేబుల్‌…

యుద్ధ బుద్ధులు

నక్షత్రాలను పూలదండలా గుచ్చి లోకం గవాక్షానికి వేలాడదీయాలని అనుకుంటానా పూలతోటనెవరో గుర్రాలతో తొక్కిస్తరు తెల్ల మబ్బులకు  నీటిధారల తీగలు చుట్టి వాన రాగాన్ని ఆలపించాలనుకుంటానా శృతుల గతుల నెవరో తుఫాన్ లో కలిపేస్తరు అలల పిల్లలకు ఆటలు నేర్పిస్తుంటానా సుడిగుండాలతో చుట్టుముట్టి అల్లకల్లోల పరుస్తరు కూడలి ఐకమత్యాన్ని నాలుగు దారులుగా చీల్చి, పలుచన చేస్తరు గూటిని…

కె. శ్రీనివాస్ కు కె.ఎన్. జయమ్మ స్ఫూర్తి పురస్కారం

తెల్లారని తెలంగాణ, బుల్ డోజర్ సందర్భాలు, కె. శ్రీనివాస్ సంపాదకీయాలు, తెలంగాణలో సాహిత్య వికాసం, జూన్ 2, అనేక సందర్భాలు, కొత్త వంతెన, సంభాషణ” ఇలా…..తెలుగు ప్రపంచానికి అవసరమైన అన్ని సందర్భాలలో విలువైన ఎన్నో పుస్తకాలను వెలువరించారు కె. శ్రీనివాస్. జర్నలిస్టుగా నాలుగు దశాబ్దాలకు పైగా కె.శ్రీనివాస్ రాసిన కథనాలు, సంపాదకీయాలు, చేసిన ఇంటర్వ్యూలు,  సమకాలీన…