వైసిపిలో పెరుగుతున్న అసహనం
అమరావతి,ఏప్రిల్1: పుట్టపర్తిలో టీడీపీ నేతలపై వైసీపీ దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. వైసీపీ లో ఓటమి భయంతో ఫ్రస్టేషన్ కనిపిస్తోందన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…‘పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి వాహనంపై, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజూ దాడులు సమాధానం కాలేవు.…
