prajatantra_news

prajatantra_news

గురుకులాల్లో ఏదైనా జరిగితే బాధ్యత అధికారులదే

ప్రిన్సిపాల్స్‌, ఆర్సీవోలతో పొన్నం జూమ్‌ మీటింగ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18 : ఇటీవల గురుకులాల్లో జరుగుతున్న వరుస సంఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ విచారం వ్యక్తం చేశారు. ఆర్సివోలు విధిగా గురుకులాలు తనిఖీలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 327 బీసీ గురుకులాల ప్రిన్సిపాల్స్‌, ఆర్సీవోలతో గురుకుల కార్యదర్శి సైదులు, బీసీ సంక్షేమ శాఖ…

కాంగ్రెస్‌లోకి జడ్చర్ల చైర్మన్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో పలువురు జడ్చర్ల నాయకులు శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. జడ్చర్ల మునిసిపల్‌ చైర్మన్‌ కోనేటి పుష్పలత (బీఆర్‌ఎస్‌), కౌన్సిలర్లు చావా నాగరాజు లలిత (బీజేపీ), గుండా ఉమాదేవి (బీఆర్‌ ఎస్‌)లు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల ఎంఎల్‌ఏ అనిరుధ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే బీజేపీలో చేరాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు సమక్షంలో మిర్యాలగూడకు చెందిన రాష్ట్ర ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యుడు దైద రవి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. బీజేపీలో చేరిన ప్రతి ఒక్కరికీ స్వాగతం.. ఇంకొన్ని రోజుల్లో…

భ్యానగరంలో భారీ వర్షం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: నగరంలోని శుక్రవారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, మెహదీపట్నం, మణికొండ, షేక్‌పేట్‌, గోల్కొండ, లంగర్‌హౌస్‌, బంజారాహిల్స్‌, తార్నాక, నాచారం, మల్లాపూర్‌, హబ్సిగూడ, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, నిజాంపేట్‌, మియాపూర్‌, మూసాపేట్‌ సహా బాలానగర్‌, ఎర్రగడ్డలలో భారీ వర్షం కురుస్తోంది. అలాగే మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌,…

డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయొద్దు

– ఒక్క కేసులోనూ ఆధారం చూపడం లేదు – లోకేశ్‌ను కలిస్తే తప్పేంటి? – సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ విమర్శలు ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 18: తనపై టన్నుల కొద్దీ కేసులు పెట్టారని చివరికి గుండు సూదంత ఆధారం కూడా చూపలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

పదేళ్లుగా మా బావను వెంటాడుతున్నారు

రాబర్ట్‌ వాద్రాపై కేసులో రాహుల్‌ విమర్శలు న్యూదిల్లీ, జూలై 18 :మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా తన బావ రాబర్ట్‌ వాద్రాను వెంటాడుతూనే ఉందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. దురుద్దేశంతో, రాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసును ఎదుర్కొనేందుకు రాబర్ట్‌ వాద్రా, ప్రియాంకల కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ…

వివాదరహితంగా నీటి సమస్య పరిష్కారం

-పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేశాకనే బనకచర్లపై ఆలోచించాలి -ఇరు రాష్ట్రాల సిఎంలతో భేటీకి కేంద్రం చొరవ మంచిదే -తెలంగాణ సెంటిమెంట్‌తో రెచ్చగొడుతున్న బిఆర్‌ఎస్‌ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై18: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదం పరిష్కారానికి సంబంధించి కేంద్రం సమావేశం ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి…

పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు

పోలీసుల హైఅలర్ట్‌ దిల్లీ: దేశ రాజధాని దిల్లీ, కర్నాటకలోని బెంగళూరు అనేక స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన బాంబు నిర్వీర్య బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. ముందుగా దిల్లీలో 20 పాఠశాలలకు హెచ్చరికలు వచ్చాయి. తొలుత రోహిణి సెక్టార్‌-3లోని అభినవ్‌ పబ్లిక్‌ స్కూల్‌ ఈ బెదిరింపు మెయిల్‌ను గుర్తించినట్లు…

బాలిస్టిక్‌ క్షిపణుల పరీక్ష విజయవంతం

న్యూదిల్లీ, జులై 18: స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులు పృథ్వీ 2, అగ్ని 1ల పరీక్ష విజయవంతం అయింది. ఒడిశా చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి ది స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌ (ఆధ్వర్యంలో వీటిని గురువారం పరీక్షించారు. పృథ్వీ 2, అగ్ని 1లు ఆపరేషనల్‌, టెక్నికల్‌ పారామీటర్స్‌ను అందుకున్నాయి. దీంతో పరీక్ష విజయవంతం అయింది.…

సుప్రీం కోర్టుకు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ

విచారణ కమిటీ నివేదిక రద్దుకు విజ్ఞప్తి దిల్లీ, జులై 18: తన అధికారిక నివాసంలో నోట్ల కట్టలు లభించిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో ఎంక్వైరీ కమిటీ నివేదికను పక్కన పెట్టాలని అభ్యర్థించారు. దిల్లీ: తన అధికార నివాసంలో నోట్ల కట్టలు లభించిన వ్యవహారంలో న్యాయమూర్తుల విచారణ…