prajatantra_news

prajatantra_news

భారీగా గంజాయి పట్టివేత

రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 28: ఖమ్మం ఈగల్‌ టీమ్‌, రాచకొండ పోలీసులు జరిపిన తనిఖీలలో భారీగా గంజాయి పట్టుబడిరది. రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద 935 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి రాజమండ్రి మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని 455…

షటిల్‌ ఆడుతూ కుప్పకూలిన యువకుడు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 28: షటిల్‌ ఆడుతుండగా ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. నాగోల్‌లో ఈ విషాదకర సంఘటన జరిగింది. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన గుండ్ల రాకేష్‌ (25) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తూ నాగోల్‌లో నివసిస్తున్నాడు. అక్కడి ఇండోర్‌ స్టేడియంలో షటిల్‌ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి…

ఎస్టీల సంక్షేమంలోని లోపాలను సరిచేస్తున్నాం

– గిరిజన సలహా మండలి సమావేశంలో మంత్రి అడ్లూరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 28: మాసబ్‌ ట్యాంక్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కల ఆధ్వర్యంలో 7వ గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశం సోమవారం…

రాష్ట్ర సాధనలో జైపాల్‌ కృషి ఎనలేనిది

– జైపాల్‌ రెడ్డి వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకం – కుటుంబ సభ్యులను పరామర్శించిన నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 28: తెలంగాణ ముద్దుబిడ్డ, విలువల విఖ్యాతకుడు ఎస్‌.జైపాల్‌ రెడ్డి అని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. జైపాల్‌ రెడ్డి ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయన మెమోరియల్‌ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా…

నిష్కళంక నేత జైపాల్‌రెడ్డి

సీఎం రేవంత్‌ నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 27: రాష్ట్ర, దేశ రాజకీయాల్లో జైపాల్‌రెడ్డి ఒక ఉన్నత శిఖరం అని, ప్రజాస్వామ్యం, రాజకీయాల పట్ల లోతైన అవగాహన ఉన్న వ్యక్తి అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి వర్థంతి సందర్భంగా ఆయనకు సీఎం నివాళులర్పించారు. ప్రతి అంశంపై…

యువతకు మార్గదర్శిగా నిలిచిన కలాం

సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 27: మాజీ రాష్ట్రపతి భారత రత్న ఏపీజే అబ్దుల్‌ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జ్ఞానానికి ప్రతీకగా, విద్యార్థులు, యువతకు మార్గదర్శిగా నిలిచిన కలాం తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈమేరకు ’ఎక్స్‌‘లో…

109 మానవ హక్కుల ఉల్లంఘన కేసులపై విచారణ

~ సోమ, మంగళవారాల్లో ఎన్‌హెచ్‌ఆర్‌సీ బహిరంగ విచారణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 27: జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఈనెల 28, 29 తేదీల్లో రాష్ట్రానికి చెందిన 109 మానవ హక్కుల ఉల్లంఘన కేసులను విచారించేందుకు హైదరాబాద్‌లో రెండు రోజులపాటు ప్రత్యేక బహిరంగ విచారణ చేపట్టనుంది. చైర్‌పర్సన్‌ జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, సభ్యులు జస్టిస్‌ (డాక్టర్‌)…

ప్రణాళికాబద్ధంగా మేడారం జాతర

-ఏర్పాట్లపై సమీక్షలో అధికారులకు ఆదేశాలు – రూ.150 కోట్లతో మేడారంలో శాశ్వత పనులు – కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్న పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు తాడ్వాయి, ప్రజాతంత్ర, జులై 27: కుంభమేళాను తలపించే సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు పటిష్టంగా, ప్రణాళికాబద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు…

యూరియా కొరత లేదు.. ఆందోళన వద్దు

– ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూముల్లోకి అటవీ, పోలీసు అధికారులు వెళ్లొద్దు – మహిళా సంఘాలతో జిల్లాల్లో చేప పిల్లల పెంపకం ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 27: వరద పరిస్థితులు.. అప్రమత్తత, ప్రజలకు అందించాల్సిన సహాయక చర్యలు, సంక్షేమ పథకాలు, ఇతర అత్యవసర సదుపాయాల కల్పనపై ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క…

మేడారంలో ప్రభుత్వ అతిథి గృహం

రూ.5 కోట్లకు పరిపాలనా అనుమతి ములుగు, ప్రజాతంత్ర, జులై 27: ములుగు జిల్లాలోని మేడారంలో గెస్ట్‌ హౌస్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. నాలుగు సూట్ల గెస్ట్‌ హౌస్‌ నిర్మాణానికి ఆర్‌అండ్‌బి శాఖ పరిపాలన అనుమతులు ఇచ్చింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క విజ్ఞప్తి మేరకు గెస్ట్‌హౌస్‌ నిర్మాణానికి…