prajatantra_news

prajatantra_news

అమెరికా కాన్సుల్‌ జనరల్‌ లార్సన్‌కు ఆత్మీయ వీడ్కోలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: అమెరికా కాన్సుల్‌ జనరల్‌గా తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న జెన్నిఫర్‌ లార్సన్‌కు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు గురువారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే చేనేత చీరను ఆమెకు బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ-అమెరికా మధ్య సత్సంబంధాలను…

ప్రభుత్వం చేతికి కాళేశ్వరం కమిషన్‌ నివేదిక

– నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జాకు అందజేసిన పీసీ ఘోష్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణకు నియామకమైన పీసీ ఘోష్‌ కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి గురువారం అందజేసింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ బీఆర్‌కే భవన్‌కు వెళ్లి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు వెయ్యి పేజీల…

అంతిమంగా సత్యం, ధర్మం గెలిచాయి

KTR

– ఫిరాయింపుల కేసులో సుప్రీం తీర్పుపై కేటీఆర్‌ స్పందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అంతిమంగా సత్యం, ధర్మం గెలిచాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును బీఆర్‌ఎస్‌ స్వాగతిస్తున్నదని చెప్పారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారత దేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం…

ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి

– స్పీకర్‌కు ధర్మాసనం ఆదేశాలు – గతంలోని డివిజన్‌ బెంచ్‌ తీర్పు కొట్టివేత – సుప్రీం కోర్టు కీలక తీర్పు న్యూదిల్లీ, జులై 31: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనర్హత పిటిషన్లపై వీలైనంత త్వరగా లేదా మూడు నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ జస్టిస్‌…

ప్రజల్లో బీజేపీపై నమ్మకం కనిపిస్తోంది

– మానుకోటలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మహబూబాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: ఇది గతంలో చెప్పుకునే మానుకోట కాదు.. ఇప్పుడు బీజేపీ మానుకోటగా మారింది.. త్వరలో బీజేపీ అడ్డాగా మారుతుంది.. వీరభద్రస్వామి ఆశీర్వాదం, సేవాలాల్‌ మహారాజ్‌ ఆశీర్వాదం బీజేపీకి ఉన్నాయి అని పార్టీ రాష్ట్ర అధక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. మానుకోటలో జరిగిన కార్యకర్తల విసృతస్థాయి…

మహిళల పేరిట సంక్షేమ పథకాలు

` కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం ` మంత్రి పొంగులేటి నేలకొండపల్లి, ప్రజాతంత్ర, జూలై 30: కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నదని, మహిళల పేరిట సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్టి రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా…

జీఎస్టీ ఎగవేతలో కొత్త కోణం

– రూ.100 కోట్లకుపైగా పన్ను చెల్లించకుండా మోసం – కేషన్‌ ఇండస్ట్రీస్‌పై వాణిజ్య పన్నుల శాఖ దాడులు – నకిలీ బిల్లులు, ఖాలీ వాహనాలు స్వాధీనం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30: హైదరాబాద్‌లోని ప్రధానమైన ప్రైవేట్‌ సంస్థ కేషన్‌ ఇండస్ట్రీస్‌ ఎల్‌ఎల్‌పీ కంపెనీ పన్ను మోసాన్ని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. విశ్వసనీయ సమాచారం…

ప్రమోషన్‌పై నిర్ణయం తీసుకోండి

– లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు – రాష్ట్ర ప్రిన్సిపల్‌ కన్జర్వేటర్‌కు తేల్చిచెప్పిన హైకోర్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : శేరిలింగంపల్లి జోన్‌ అర్బన్‌ బయో డైవర్సిటీ వింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అనిల్‌కుమార్‌ ప్రమోషన్‌ విషయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను మూడు నెలల్లో అమలు చేయాలని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ను హైకోర్టు ఆదేశించింది.…

విద్యుత్ విభాగం ప్ర‌క్షాళ‌న‌కు సంస్క‌ర‌ణ‌లు

– రాష్ట్రంలో  కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయండి – కొత్త డిస్కమ్‌ ప‌రిధిలోకి ఉచిత విద్యుత్ ప‌థ‌కాలు – అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఉండాలి – అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు – ఇంధ‌న శాఖ‌పై డిప్యూటీ సీఎంతో క‌లిసి స‌మీక్ష‌ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జూలై 30 : రాష్ట్రంలో…

ఉన్న భూమిని కాపాడలేరా?

BC Reservations

– భూదాన్‌ బోర్డును ప్రశ్నించిన హైకోర్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: పేదల గూడు కోసం మహోన్నత లక్ష్యంతో ఎంతోమంది మహానుభావులు దానంగా ఇచ్చిన భూదాన్‌ బోర్డు భూములను రక్షించాలనే యోచన బోర్డు అధికారులకు లేకుండా పోయిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక్క గజం భూమిని రక్షించాలన్న చిత్తశుద్ది భూదాన్‌ బోర్డుకు ఉన్నట్లు కనబడడం లేదని ఆగ్రహాన్ని…