Day April 3, 2026

కువైట్ చమురు శుద్ధి కర్మాగారంపై దాడి

– డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరాన్ – పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు కువైట్ ప్రకటన కువైట్ సిటీ, ఏప్రిల్ 3: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. శుక్రవారం కువైట్‌లోని ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం మీనా అల్‌ అహ్మదిపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఆ ప్రాంతంలో భారీఎత్తున మంటలు చెలరేగినట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్…

మళ్లీ నోరు పారేసుకున్న ఖవాజా

– భారత్ దాడులు చేస్తే బుద్ది చెబుతామని హెచ్చరిక ఇస్లామాబాద్, ఏప్రిల్ 3 :పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. పహల్గాం దాడి జరిగి ఏడాది కావస్తున్న నేపథ్యంలో భారత్ తమపై బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే వారు తమపై దాడులకు ప్రణాళికలు రచిస్తూ రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోందన్నారు.…

మరో మూడు రోజులు పార్లమెంట్

– 16 నుంచి తిరిగి సమావేశాలు ప్రారంభం – మహిళా రిజర్వేషన్, ఎఫ్‌సిఆర్‌ఎ సవరణ బిల్లులపై చర్చ న్యూదిల్లీ, ఏప్రిల్ 3 : మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లు, ఎఫ్‌సిఆర్‌ఎ సవరణ బిల్లు వంటి ముఖ్యమైన బిల్లులకు ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను పొడిగించేందుకు ప్రయత్నిస్తోంది. గురువారం బడ్జెట్ సమావేశాల రెండో దశ…

దొడ్డి కొమురయ్యకు కేసీఆర్ నివాళి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘన నివాళులర్పించారు. ప్రజా వ్యతిరేక పాలన మీద తెలంగాణ ప్రజల తిరుగుబాటుకు సంకేతంగా నిలిచిన కొమరయ్య అమరత్వం నాటి రాచరిక పాలకుల నుంచి నేటి ప్రజా వ్యతిరేక పాలకుల మీద సాగుతున్న…

తెలంగాణ డీఎన్‌ఏలోనే టెక్స్‌టైల్

– మా విజన్‌లో భాగస్వాములు కండి – ఎటెక్స్‌కాన్ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: నిజాం కాలంలో ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌కు వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేసేవారు..టెక్స్‌టైల్ మనకు పరిశ్రమ మాత్రమే కాదు.. జీవనాధారం అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ డీఎన్‌ఏలోనే టెక్స్‌టైల్ ఉందని చెప్పడానికి…

గ్రూప్-1పై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం

– ‘ఎక్స్‌’లో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగ నియామకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాను.. ఇది ఉద్యోగ నియామకాల పట్ల మా ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపుగా భావిస్తున్నాను అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. కొలువుల కోసం ఏళ్లకు ఏళ్లు కళ్లు…

సైన్యంలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: భారతీయ సైన్యం రిక్రూట్‌మెంట్ -2027 కోసం ఫిబ్రవరి 13, 2026న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో రిజిస్ట్రేషన్ చివరి తేదీ 1 ఏప్రిల్ 2026 వరకు ఉండగా ఇప్పుడు దరఖాస్తు గడువును ఏప్రిల్ 10 వరకు పొడిగించారు. నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేయలేని అర్హులైన యువతీ యువకులు అధిక సంఖ్యలో…