Day March 6, 2026

‌ప్రజల మద్దతుతో పాలన సాగిస్తున్నాం

– అందరి మద్దతుతోనే గెలిచాం – మాటలు, మూటలతో గెలిచి రాలేదు – మా వద్ద ఎలాంటి అక్రమ సంపాదనా లేదు – వర్గీకరణ కోసం చేసిన పోరాటానికి మద్దతుగా నిలిచా – సీఎం రేవంత్‌రెడ్డి – మాదిగ ఎంప్లాయీస్‌ ‌సమన్వయ కమిటీ సమావేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 6: చిత్తశుద్ధితో ప్రజాసమస్యలు పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి…

బలగం ఫేమ్ నారాయణకు సతీవియోగం

– రామాయంపేటలో విషాదఛాయలు కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, మార్చి 6: మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన బలగం సినిమా ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన మురళీధర్ గౌడ్(బలగం నారాయణ) సతీమణి, వార్డు మాజీ సభ్యురాలు ఐరేని శశికళ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. గతంలో రామాయంపేట పంచాయతీగా ఉన్న సమయంలో ఆమె వార్డు సభ్యురాలిగా ఉన్నారు. శశికళ మృతితో…

హాస్పిటల్స్ లో సమగ్ర పాలన వ్యవస్థలు అవసరం

– హాస్పిటల్స్ లో పరిపాలన, చట్టాల అమలుపై చర్చ – ముగిసిన‌ కేర్ హాస్పిటల్స్ ‘ప్రవర–2026’ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 6: కేర్ హాస్పిటల్స్ నిర్వహించిన రెండు రోజుల ‘ప్రవర–2026’ గవర్నెన్స్ & కంప్లయెన్స్ సమ్మిట్ శుక్రవారం ముగిసింది. బంజారాహిల్స్‌లో జరిగిన ఈ సదస్సులో హాస్పిట‌ల్స్ పరిపాలన, చట్టపరమైన నిబంధనలు, రోగి భద్రత వంటి అంశాలపై…

మూడు వారాల్లో క్యాతన్‌ ‌పల్లి చైర్మన్‌ ఎన్నిక

– ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌,‌ మార్చి 6:  క్యాతనపల్లి మున్సిపల్‌ ‌చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌ ఎన్నిక మూడు వారాల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ వివాదంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లిలో పలు రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో…

విద్యార్థులు మంచి దృక్పథాన్ని అల‌వ‌ర‌చుకోవాలి

– సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి – కిట్స్‌లో జాతీయస్థాయి కార్నివాల్ ‘సంస్కృతి-26’ వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 6: మీ కలల్లో రాణించండి.. సోషల్ మీడియా అసంబద్ధమైన అంశాలకు అలవాటుపడకండి.. తాజా సాంకేతికతలను ఆస్వాదించండి.. మంచి దృక్పథాన్ని అల‌వ‌ర‌చుకోవాలి అంటూ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, కిట్స్ పూర్వ విద్యార్థి ప్రశాంత్ ఆర్ విహారి…

ఛత్తీస్‌గఢ్‌ ‌లో ప్రైవేట్‌ ‌బస్సు బోల్తా

– ఐదుగురు ప్రయాణికుల మృతి రాయ్‌పూర్‌,‌మార్చి 6: ఛత్తీస్‌గఢ్‌ ‌లోని జాష్‌పూర్‌ ‌జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మరికొన్ని గంటల్లో తమ గమ్య స్థానం చేరుకుంటామనే లోపు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. ఒక ప్రైవేట్‌ ‌బస్సు బోల్తా పడటంతో ఐదుగురు మృతిచెందగా, 20 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు,…

మహిళల అభివృద్ధికి మార్గం మహిళా రక్షణ చట్టాల అమలులో నిబద్ధతే

The Path to Women’s Development Lies in Strong Implementation of Protection Laws

భారతదేశంలో మహిళల రక్షణ చట్టాల సమర్థవంతమైన అమలుకు సంస్థాగత సామాజిక చర్యలు అవసరం. చట్టాల అమలును బలపరచడం ద్వారా మహిళలకు న్యాయం అందించవచ్చు. ఇందుకోసం మహిళలకు సంబంధించిన కేసులను సమర్థంగా నిర్వహించేందుకు పోలీసులకు లింగసున్నితమైన శిక్షణ ఇవ్వాలి. మహిళలపై జరిగే నేరాలపై త్వరితగతిన న్యాయం అందించేందుకు ప్రత్యేక కోర్టుల సంఖ్యను పెంచాలి. మహిళలు తమ హక్కులు అందుబాటులో ఉన్న న్యాయ మార్గాల గురించి తెలుసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తు చేస్తుంది. లింగ సమానత్వం,  మహిళల సాధికారత, విద్య, భద్రత, నాయకత్వం ఎంత ముఖ్యమో ఈ రోజు సమాజానికి గుర్తు చేస్తుంది. ప్రభుత్వాలు, సంస్థలు, సమాజాలు వివిధ రంగాల్లో మహిళల కృషిని గుర్తించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాయి. సమాజంలో మహిళలు ఎదుర్కొనే వివక్ష, హింస అడ్డంకులను తొలగించాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తుంది.. 2026 సంవత్సరానికి నేపథ్యం (థీమ్) “లాభం కోసం ఇవ్వండి” (Give to Gain).అంటే వ్యక్తులు,   సమాజాలు మహిళలకు మద్దతు, వనరులు,  అవకాశాలు అందించినప్పుడు అందరికీ లాభం కలుగుతుందని ఈ భావన.  ఈ థీమ్ ఉదారత, సహకారం,  లింగ సమానత్వం కోసం సమిష్టి బాధ్యతను ప్రోత్సహిస్తుంది. కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల హక్కులను గౌరవిస్తూ సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపిస్తుంది.  మహిళల…

ఇజ్రాయిల్‌పై తీవ్రమైన ఇరాన్‌ ‌ప్రతిదాడులు

– డిమోనా అణు కేంద్రంపై దాడికి ఇరాన్‌ ‌గురి టెహ్రన్‌,‌ మార్చి 6: ఇజ్రాయిల్‌ ‌దాడులకు ప్రతిదాడులను ముమ్మరం చేసిన ఇరాన్‌ ఇ‌జ్రాయెల్‌అణు రియాక్టర్‌పై గురిపెట్టిందన్న వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయిల్‌ అణు కేంద్రాన్ని ధ్వంసం చేస్తామని ప్రకటించింది. ఇజ్రాయెల్‌ ‌తన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను డిమోనాకు రక్షణగా మోహరించింది. ప్రపంచంలోనే అత్యంత దుర్భేద్యమైన ప్రదేశంగా మార్చేసింది.…

భయపెడుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. మార్చి మాసం ఆరంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తీవ్ర వేడి కేవలం ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా, రాష్ట్ర విద్యుత్ వ్యవస్థపై కూడా పెను ప్రభావాన్ని…