Day February 14, 2026

ముఖ్యమంత్రిని కలిసిన వడ్డేపల్లి ఏఐఎఫ్‌బీ కౌన్సిలర్లు

– వారితో పీసీసీ చీఫ్ మహేష్, మంత్రి జూపల్లి తదితరులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపల్‌లో గెలిచిన ఏఐఎఫ్‌బీ కౌన్సిలర్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శనివారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్…

మంత్రులకు సీఎం అభినందనలు

– ముగిసిన ఇష్టాగోష్ఠి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన సందర్భంగా మంత్రులందరినీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అభినందించారు. అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. పార్టీ విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషిచేసిన పార్టీ కార్యకర్తలకు సీఎం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…

జాతీయ సదస్సుకు కుమారస్వామికి ఆహ్వానం

జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: జనగామ పట్టణానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, పరిశోధకుడు, ఎల్.బి. బిఈడి కళాశాల సీనియర్ తెలుగు అధ్యాపకుడు కోడం కుమారస్వామికి జాతీయస్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సహకారంతో ఈనెల 17, 18…

మహా శివరాత్రి వేడుకలకు ఆల‌యాలు ముస్తాబు

– వేములవాడలో నేటి నుంచే రాజన్న జాతర – భీమేశ్వరాలయంలో భక్తుల కోసం సకల సౌకర్యాలు వేములవాడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలను ముస్తాబు చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిచెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం, వరంగల్ వేయి స్తంభాల గుడి తదితర క్షేత్రాల్లో…

సీపీఐ నేత గిరిప్రసాద్ సతీమణి కమలాదేవి కన్నుమూత

– సంతాపం ప్రకటించిన ఎమ్మెల్యే కూనంనేని హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: సీపీఐ అగ్ర నాయకుడు నల్లమల గిరిప్రసాద్ సతీమణి నల్లమల కమలాదేవి (87) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కమలాదేవి భౌతిక కాయాన్ని బంధువులు, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం జూబ్లీహిల్స్‌లోని ఆమె…

రైతులకు త్వరలో శుభవార్త

– రైతు భరోసా విడుదలకు రంగం సిద్దం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రైతులకు శుభవార్త చెప్పనుంది. మున్సిపల్ ఎన్నికల పక్రియ ముగిసిన వెంటనే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం…

ఖ‌మ్మం జిల్లాలో జోరుగా క్యాంప్ రాజ‌కీయాలు

– ఛైర్ ప‌ర్స‌న్‌ల ఎన్నిక‌పై ఉత్కంఠ‌ – కొత్త‌గూడెంలో ర‌స‌ప‌ట్టు రాజ‌కీయం ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 :  ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఏడు పురపాలికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ఈ నెల 16న ఛైర్ పర్సన్ ఎన్నిక జరగనుంది. ఆ పార్టీ అభ్యర్థులే ఛైర్మెన్ లు గా  ఎన్నికవనున్నారు. ఖమ్మం జిల్లా…

జీ హెచ్ ఎమ్ సీ… మూడు ముక్కలాట …?

“నేడు, తెలంగాణ ప్రభుత్వం అదే “మెరుగైన పరిపాలన ” సాకుతో  జీ హెచ్ ఎమ్ సీ   ని మూడు కార్పొరేషన్లుగా (హైదరాబాద్, సైబరాబాద్, మరియు మల్కాజిగిరి) విభజించడానికి ప్రయత్నిస్తోంది. వికేంద్రీకరణ అనేది ఒక గ్లోబల్ హబ్‌కు అవసరమైన సాంకేతిక చర్య అని మద్దతుదారులు వాదిస్తుంటే, విమర్శకులు మాత్రం ఇది కొత్త పేరుతో దక్కన్ ప్రాంతానికి తిరిగి వచ్చిన…

వియత్నాం నుంచి తిరుగు ప్రయాణం

“ఇలాంటి గెరిల్లా యుద్ధ పద్ధతులు అక్కడ చాలా ఉన్నాయి. అందువల్లనే అమెరికా సైనికులు భారీగా మరణించారు. ఫలితంగా అమెరికా లాంటి అగ్రరాజ్యం యుద్ధం విరమించినట్లు ప్రకటించింది. అప్పటినుంచి ఉండిపోయిన అమెరికన్లు, ఆ ప్రదేశంలో జరుగుతున్నంత సేపు వియత్నా మీస్ యుద్ధ నైపుణ్యానికి ఆశ్చర్య పోయాను. పలు యుద్ధాలను ఎదుర్కొని 1975లో స్వతంత్రాన్ని పొందిన వియత్నాం అతి కొద్ది సమయంలోనే వాళ్ళు సాధించిన సాంకేతిక, సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఫిదా అయ్యాను. శ్రమపట్ల వాళ్ళకున్న గౌరవం, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం వాళ్ళను ఈనాడు ముందంజలో ఉంచింది. ప్రస్తుతం అమెరికా వియత్నాం మిత్రదేశాలు.” గిరియానం – 1 హోచిమన్ నగరం వియత్నాం దేశానికి రాజధాని. దక్షిణ వియత్నాంలో ఉంది. వాతావరణం వెచ్చగా ఉంటుంది. పూర్వం ఈ నగరాన్ని సైగాన్ అని పిలిచేవాళ్ళు. సైగాన్ నదీ తీరంలో ఉండడం వల్ల ఆ పేరు వచ్చి ఉంటుంది. తరువాత కమ్యూనిష్టు నాయకుడు హోచిమన్ మీద గౌరవంతో ఆ పేరు స్థిరపడింది. ఈ నగర జనాభా 14 మిలియన్లు. ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం. హోచిమన్ అసలు పేరు న్గుయెన్ సీన్ కుంగ్. మే 19 తేదీన 1890 సంవత్సరంలో జన్మించాడు. సుమారు ఇరవై యేళ్ళ వయసులో దేశం విడిచిపెట్టి వెళ్ళి ‘ వియత్ మిన్ ‘ అనే సంస్థను స్థాపిం చాడు. ఫ్రాన్స్ , అమెరికా యుద్ధాలలో వియత్నాం విముక్తి కొరకు గెరిల్లా యుద్ధ పద్ధతుల్లో పోరాటం చేసాడు. ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం అని రెండు భాగాలుగా ఉన్న వియత్నాంను ఏకం చేయాలని ఆయన ఆశయం. 1945 నుంచి 1969 దాకా ఉత్తర వియత్నాం అధ్యక్షుడుగా పనిచేసాడు. 1969లో మరణించాడు. ఆయన మరణించిన తర్వాతనే ఉత్తర దక్షిణ వియత్నాంలు 1975లో ఒకే దేశంగా రూపొందింది. ఈ విషయాలు గైడ్ చెర్రీ చెపుతున్నప్పుడు నాకు ప్రొ. జయశంకర్ గుర్తుకు వచ్చాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు కలగన్న ఆయన మరణించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తొమ్మిది మంది బృందంలో నేను, పద్మ, అనురాధ వియత్నాం వార్ మ్యూజియం చూడడానికి వెళ్ళాం. ఈ మ్యూజియం ను 1975 లో ప్రారంభించారు. ఇది అమెరికా వియత్నాం యుద్ధానికి సజీవ సాక్ష్యం. బయటి ప్రాంగణంలో ఆ యుద్ధంలో ఉపయోగించిన ట్యాంకర్లు, విమానాలు ఉన్నాయి. వార్ మ్యూజియం…