Tag Telangana agitation

1969 తెలంగాణా ఉద్యమం

33.జనధర్మోవిజయతే జూన్ 2:  నెత్తురోడిన వరంగల్లు రోజు 2014 జూన్ 2 తెలంగాణ అధికారికంగా అవతరించిన రోజు. అర్థశతాబ్దం నుంచి పోరాడిన జనం తెలంగాణను సాధించారు. ఆశ్చర్యం ఏమంటే తెలంగాణ నాడి వరంగల్లు నగరంలో 1969 జూన్ 2న  వరంగల్ జిల్లా ప్రజాసమితి పిలుపుననుసరించి వరంగల్ పోస్టాఫీసు ముందు సత్యాగ్రహం జరిగింది. శ్రీయుతులు వెలగందుల వైకుంఠం. అరుసం కొమురయ్య, నరసింహార్య, భూపతి కృష్ణమూర్తి పార్సి యీశ్వరయ్య, వెలిశాల కనకయ్య, గోపీ కిషన్ లాహోటీ ప్రభుృతులు నాయకత్వం వహించారు. పోస్టాఫీసు వద్ద పోలీసులు వీరిని చెదరగొట్టటానికి లాఠీఛార్జి చేశారు. శ్రీయుతులు వెలగందుల వైకుంఠం, భూపతి కృష్ణమూర్తి, గోపీకిషన్ వగైరాలకు లాఠీలవల్ల గాయాలు తగిలాయి.   ఖండన అయినా సత్యాగ్రహులను చెదరగొట్టలేకపోయిన పోలీసులు కాల్పులు జరపగా శ్రీ చంద్రమౌళి, షేక్ ఫకీరు చనిపోయారు. మరునాడు…