వెలుగుమట్ల వెలుగులు ఆర్పినదెవరు? ఎందుకు?

“భూదాన భూములు దేశవ్యాప్తంగానూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అతి ఎక్కువగా అత్యంత దారుణమైన కబ్జాలకు, ఆక్రమణలకు, అన్యాక్రాంతానికి బలి అయిపోయాయి. ఎక్కడైనా భూదాన భూమి ఉందని తెలిస్తే చాలు, రాజకీయ నాయకులు, అధికారులు, సంపన్నులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి దాన్ని స్వాహా చేయడం ఎట్లా అని ఎత్తులకు పై ఎత్తులు వేశారు. భూములను ఆక్రమించారు.…
