దశాబ్ది తెలంగాణ కథ – గిరిజన జీవనం 4

(2014-2023) (గత సంచిక తరువాయి భాగం) చందు తులసి రాసిన ‘‘నీళ్ళబిందె’’ (2018) కథ పట్టణాలలో వలసకూలీ జీవితం గడుపుతున్న లంబాడీ స్త్రీలు గుక్కెడు నీళ్ళకోసం ప్రతిరోజూ యుద్ధం చేయాల్సి వస్తున్న స్థితిని చిత్రించింది. ‘‘జీవితం నదిలా కాకున్నా కనీసం మురికికాలువలాగానైనా గడుస్తుందని ఆశపడి తండానుండి నగరానికి చేరుకుంటే అక్కడ తాగడానికి కూడా చుక్కనీళ్లు దొరకక…
