కనువిప్పు కావాలి

దక్షిణ భారతంలో తెలుగుప్రజలు మాత్రమే రెండురాష్ట్రాలుగా విడిపోయారు. ఈ క్రమంలో రెండురాష్ట్రాల ప్రజలమధ్య ద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయి, ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో సృజనాత్మకరంగానికి చెందిన కవులు, రచయితలు, కళాకారులు కీలకమైనపాత్ర పోషించటం శోచనీయం. ఈ నేపథ్యంలో ముందుకు వచ్చిన ఛాయ లిటరరీ ఫెస్టివల్ కు ప్రాంతీయత పరమార్థం కాకూడదు. ఆధిపత్యభావనలకు అతీతంగా…
